తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ నూతన చైర్మన్, స భ్యులను సీఎం కేసీఆర్ గురువారం నియమించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కమిషన్ సభ్యులుగా ఇద్దరికి స్థానం కల్పించారు. ఇప్పటికే కమిషన్లో సభ్యురాలుగా ఉన్న ఆ దిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయిగూడ గ్రా మా నికి చెందిన కుస్రం నీలాదేవీని అలాగే కొనసాగించారు.
మం చిర్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్గా ఉన్న బెల్లంపల్లికి చెందిన రేణికుంట ప్రవీణ్ను కమిషన్లో సభ్యుడిగా ఎంపిక చేశారు. వీరిద్దరికీ తెలంగాణ ఉద్యమకారులుగా గుర్తింపు ఉంది. నీలాదేవి గతంలో గుడిహత్నూర్ జడ్పీటీసీ, ఇచ్చోడ జడ్పీటీసీగా కూడా పని చేశారు. ఈ మేరకు సీఎస్ శాంతి కుమారి ఉత్తర్వులు చేశారు.
– మంచిర్యాల, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)