నిర్మల్ టౌన్, జనవరి 27 : అంగన్వాడీ కేం ద్రాల్లో పని చేస్తున్న ఆయాలకు, టీచర్లకు పని ఒత్తి డి తగ్గించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని కోరు తూ సీఐటీయూ ఆధ్వర్యంలో ఐసీడీఎస్ కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమా న వేతనం ఇవ్వాలని కోరారు.
రాష్ర్టానికో విధానాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నదని, దీం తో తెలంగాణలోని అంగన్వాడీ సిబ్బందికి అన్యా యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి సురే శ్, అధ్యక్షురాలు రాజమణి, గౌరవాధ్యక్షురాలు సుజాత, నాయకులు లలిత, శైలజ, శశికళ, భాగ్యలక్ష్మి, వనజ, హేమలత, నర్సమ్మ పాల్గొన్నారు.