మంచిర్యాలటౌన్, నవంబర్ 13 : ‘రేటెంత రెడ్డి.. దళితులపై ఇంత అహంకారమా..?, ఒల్లు బలిసి, మదమెక్కి మాట్లాడుతున్నవా..’ అని చె న్నూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, విప్ బా ల్క సుమన్ మండిపడ్డారు. మంచిర్యాలలోని మా జీ ఎమ్మెల్యే గడ్డం అరవిందరెడ్డి నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచిర్యాల, బెల్లంపల్లి అభ్యర్థులు నడిపెల్లి దివాకర్రావు, దుర్గం చిన్నయ్య, ఎంపీ వెంకటేశ్ నేతకాని, మాజీ ఎమ్మెల్యే అరవిందరెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడు రాష్ట్ర రాజకీయాలను కలుషితం చేస్తున్నాడని, టికెట్లు అ మ్ముకుంటూ రేటెంత రెడ్డిగా మారిపోయాడని విమర్శించారు. ఆయన వల్ల గాంధీభవన్కు తాళా లు వేసే పరిస్థితి ఏర్పడిందని, ఎంతోమందిని మో సం చేసి, కడుపులు కొట్టి కన్నీళ్లు పెట్టిస్తున్నాడని మండిపడ్డారు. బెల్లంపల్లికి వచ్చిన సందర్భంగా ఆయన బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి చిన్నయ్యపై, తనపై ఇష్టారీతిన మాట్లాడాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాము అక్రమంగా కోట్లు సంపాధించామని, కబ్జాలు చేశామని మాట్లాడడాన్ని తప్పుబట్టారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని, కేసీఆర్ నేతృత్వంలో రాష్ట్ర సాధనకు ఎంతోకష్టపడ్డామని, సాధించుకున్న రాష్ట్రంలో తమను గెలిపించిన ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవచేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ప్రాంత అభివృద్ధికి ఎనలేని కృషిచేస్తున్నామని చెప్పారు. కోట్లాది రూపాయలతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న తమపై నోటికొచ్చినట్లు మాట్లాడడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. వంద కోట్లకు రేటెంతరెడ్డి.. కాకా కుటుంబంతో డీల్ కుదుర్చుకున్నాడని, అందులో భాగంగానే బెల్లంపల్లి, చెన్నూర్ టికెట్లను వినోద్, వివేక్కు ఇచ్చారని ఆరోపించారు. ఐదేళ్లలో కేవలం నెలరోజులు మాత్రమే సూటుకేసులు మోసుకొని వచ్చే గడ్డం బ్రదర్స్, మిగిలిన నాలుగేళ్ల 11 నెలలు ఇటు కన్నెత్తి కూడా చూడరని విమర్శించారు. వివేక్, వినోద్ తమ హయాంలో ఒక్క ఫ్యాక్టరీనీ ఏర్పాటు చేయలేదని, ఒక్క ఉద్యోగం కల్పించలేదని ఆరోపించారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో కంపెనీలు పెట్టి పారిశ్రామికవేత్తలుగా ఎదిగారని, అక్కడ సంపాధించిన సొమ్మును ఇక్కడ విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని, లీడర్లను అంగట్లో సరుకుల్లా కొంటున్నారని విమర్శిఃచారు. రేటెంతరెడ్డి వ్యవహారం నచ్చక ఏండ్లుగా పార్టీని పట్టుకొని పనిచేస్తున్న సీనియర్ నాయకులు బోడ జనార్దన్, రాజారమేశ్ లాంటి నాయకులు కాంగ్రెస్ను వీడి బీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక్క విద్యార్థి నాయకుడికి గానీ, ఉద్యమ నాయకులకు గానీ టికెట్ ఇవ్వలేదని, బీసీ, ఎస్సీ, ఎస్టీలను కావాలనే పక్కన పెట్టారని ఆరోపించారు.
అనుచిత వ్యాఖ్యలు సరికాదు : ఎంపీ వెంకటేశ్ నేతకాని
అనంతరం ఎంపీ వెంకటేశ్ నేతకాని మాట్లాడారు.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతున్నదన్నారు. రేవంత్రెడ్డి అడ్డగోలు, బుద్ధిలేని, నీచమైన మాటలు మాట్లాడాడని, ఇద్దరు దళిత ఎమ్మెల్యేలపై అనుచితంగా మాట్లాడారని మండిపడ్డారు. ఉద్యమ సమయంలో కేసీఆర్తో నడిచిన వ్యక్తి సుమన్ అని, అంచెలంచెలుగా ఎదిగిన చిన్నయ్యపై చేసిన వ్యాఖ్యలు దుర్మార్గమైనవని అన్నారు. గతంలోనే మందకృష్ణ మాదిగ రేవంత్రెడ్డిని దళిత ద్రోహి అని చెప్పాడని, బెల్లంపల్లిలో రేవంత్రెడ్డి చేసిన మాటలు ఇందుకు ఉదాహరణగా నిలిచాయని పేర్కొన్నారు. ‘నీ ప్రచారంలో నీ మ్యానిఫెస్టోను వివరించు.., నీ గురించి చెప్పుకో.., కానీ అడ్డగోలుగా ప్రజలు గెలిపించిన ఎమ్మెల్యేలపై అహంకార పూరితంగా మాట్లాడవద్దు..’ అని సూచించారు. మూడు గంటలే కరెంటు చాలనే రైతు ద్రోహి రేవంత్రెడ్డి అని ఆరోపించారు. డబ్బులు ఇచ్చి పార్టీలో చేర్చుకుంటున్నారని విమర్శించారు. నేతకానీలకు సముచిత స్థానం కల్పించింది కేసీఆర్ అని, కాంగ్రెస్ పార్టీలో నేతకానీలకు మోసం జరిగిందని అన్నారు.
భూకబ్జా చేసినట్లు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుంటా : బెల్లంపల్లి అభ్యర్థి చిన్నయ్య
‘జిల్లాలో గానీ, బెల్లంపల్లి నియోజకవర్గంలో గానీ.., ప్రభుత్వ భూమి గానీ, ప్రైవేటు భూమి గానీ గుంట కబ్జాచేశానని నిరూపించినా ఎన్నికల్లో పోటీ నుంచి తప్పుకుంటా.., లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థిని పోటీ నుంచి తప్పిస్తావా..’ అని బెల్లంపల్లి నియోజకవర్గ అభ్యర్థి దుర్గం చిన్నయ్య రేవంత్రెడ్డికి సవాల్ విసిరారు. ‘ఒక అమ్మాయి విషయాన్ని రేటెంతరెడ్డి ప్రస్తావించాడు.., ఇందులో పోలీసులు, సుప్రీంకోర్టు, మహిళా కమిషన్లను కూడా సంప్రదించారు.. వారందరూ కొట్టిపారేసిన విషయాన్ని రేటెంత రెడ్డి ప్రస్తావించడం అనైతికం..’ అని అన్నారు. ‘నాకు మూడోసారి టికెట్ వచ్చిందంటే నాపై నమ్మకంతోనే ఇచ్చారని, ప్రజలు నావెంటే ఉన్నారన్న నమ్మకం ఉండబట్టే..’అని పేర్కొన్నారు. సర్పంచ్గా, ఎంపీటీసీగా, జడ్పీటీసీగా పనిచేసి అంచెలంచెలుగా ఎదిగానని, నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నానని తెలిపారు. కరోనా సమయంలో కూడా ప్రజలకు అందుబాటులు ఉండి సేవలు అందించానని, ఎమ్మెల్యే క్వార్టర్లోనే నివాసముంటున్నానని పేర్కొన్నారు. 16 రాష్ర్టాల్లో కంపెనీలు పెట్టిన గడ్డం కుటుంబ సభ్యులు ఇక్కడ ఒక్క కంపెనీ కూడా పెట్టలేదని విమర్శించారు. ఇక్కడ ఎవరికీ సాయం చేయలేదని ఆరోపించారు.
వ్యాఖ్యలను ఖండిస్తున్నా..: మంచిర్యాల అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు
చెన్నూర్, బెల్లంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థులు బాల్క సుమన్, దుర్గం చిన్నయ్యపై పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని మంచిర్యాల ఎమ్మెల్యే అభ్యర్థి నడిపెల్లి దివాకర్రావు అన్నారు. ఈ ప్రాంత అభివృద్ధికి వీరిద్దరితో పాటు తాను కూడా కృషిచేస్తున్నానని, ఎప్పుడూ ప్రజల్లో ఉంటూ వారి బాగోగులు చూసుకుంటూ ఉండే తమపై ఇష్టారాజ్యంగా మాట్లాడడం సరికాదని హితవు పలికారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గాల్లో కనీవిని ఎరుగని అభివృద్ధి చేసినట్లు చెప్పారు. డబ్బు ఉంటే సరిపోదని, ప్రజలకు నమ్మకం కలగాలని పేర్కొన్నారు. కాంగ్రెస్ గెలిస్తే ఎవరు ముఖ్యమంత్రి అవుతారో చెప్పాలని ఆ నాయకులను ప్రశ్నించారు. బీఆర్ఎస్లో ఒక్క కేసీఆర్ మాత్రమే సీఎం అవుతారని, ఇది అందరికీ తెలుసునని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండాను ఎగిరేస్తామని స్పష్టం చేశారు.