చింతలమానేపల్లి, ఏప్రిల్ 16 : మండల కేంద్రంలో ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ సమక్షంలో బీఎస్పీకి చెందిన నాయకులు, కార్యకర్తలు సోమవారం బీఆర్ఎస్లో చేరారు. బీఎస్పీ మండల అధ్యక్షుడు గోమాసె లాహాంచు, బండి రాజన్న, రౌతు మధుకర్, విలాస్, పెరుగు శంకర్తో పాటు 20 మంది కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్సీ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండె విఠల్ మాట్లాడుతూ రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు ఉమా మహేశ్, రాణాప్రతాప్ పాల్గొన్నారు.