దిలావర్పూర్ మార్చి 24: పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటామని రాష్ట్ర అటవీ, న్యాయ, దేవాదాయ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ జిల్లాలోని దిలావర్పూర్ మండలంలోని సిర్గాపూర్ గ్రామంలో రుక్మారెడ్డి గార్డెన్లో శుక్రవారం నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. మండలంలోని 12 గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో మహిళలు, పార్టీ కార్యకర్తలు అభిమానులు తరలివచ్చారు. అనంతరం పార్టీ జెండాను అవిష్కరించి సభ్యత్వ సమోదు కార్యక్రమంలో పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారంలోని వచ్చేది బీఆర్ఎస్సేనని స్పష్టం చేశారు. రాష్ట్ర పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఈ పథకాలు ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు.
ప్రతిపక్షాల నాయకులకు కూడా పారదర్శకంగా పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు. మహిళా బిల్లు ప్రవేశపెట్టాలని దీక్ష చేసిన ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారణ పేరిట వేధిస్తున్నారని మండిపడ్డారు. మోదీని ప్రశ్నిస్తే ఈడీ ఎంట్రీ ఇస్తున్నదని విమర్శించారు. మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పోటీ చేస్తున్నదని స్పష్టం చేశారు. గ్రామాల్లో ఏవైనా సమస్యలు ఉంటే, పార్టీ మండలాధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. మైక్ దొరికితే రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఆరోపణలకే పరిమితమవుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు కొమ్ముల దేవేందర్రెడ్డి, స్థానిక సర్పంచ్ గంగారెడ్డి, ఎంపీపీ అక్షర, జిల్లా పరిషత్ కో ఆప్షన్ సభ్యులు డాక్టర్ సుభాష్రావు, బన్సపల్లి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, జిల్లా రైతుబంధు సమితి సభ్యులు చిన్నారెడ్డి, అల్లోల మురళీధర్రెడ్డి, అల్లోల గౌతమ్రెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు బాబురావు, ఎంపీటీసీలు జయసుధ, అమృత, సర్పంచ్ తిరుమల, ఓడ్నం సవిత, కృష్ణ, బీఆర్ఎస్ నాయకులు అనిల్, శ్రీనివాస్, రాంకిషన్ రెడ్డి, స్వామి గౌడ్, తిరుపతిరెడ్డి, పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన మాజీ డైరెక్టర్, నాయకులు
మండంలోని బన్సపల్లి గ్రామానికి చెందిన బన్సపల్లి సహకార సంఘం మాజీ డైరెక్టర్ గౌత ముత్యం, వార్డు మెంబర్ చిన్న నర్సయ్యతో పాటు మరో పది మంది కాంగ్రెస్ పార్టీ నుంచి సహకార సంఘం చైర్మన్ పీవీ రమణారెడ్డి అధ్వర్యంలో మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా వేసి స్వాగతం పలికారు.
అభివృద్ధ్ది అంటేనే అల్లోల..
అభివృద్ది అంటేనే ప్రజలకు గుర్తొచ్చేది మంత్రి ఇంద్రకరణ్రెడ్డి. నిర్మల్ జిల్లాకు మెడికల్ కళాశాలను తీసుకొచ్చారు. ప్రతి గ్రామంలో అభి వృద్ధి పనులు జరిగాయంటే, అది బీఆర్ఎస్ వల్లే. మంత్రి అల్లోల పై కాంగ్రెస్నాయకులు పనిగట్టుకొని తప్పుడు ప్రచారం చేస్తున్నా రు. కాంగ్రెస్ హయాంలో నిర్మల్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు. ఇప్పుడు గుడి, బడి లేని ఊరు లేదు. సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. చివరకు కాంగ్రెస్, బీజేపీ నాయకులకు కూడా అందింది. – కే దేవేందర్రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు
భావి తరాల కోసమే కాళేశ్వరం..
భావితరాల కోసమే మన సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించారు. దీని విలువ భావితరాలకు తెలుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన సంక్షేమ అభివృద్ధి పథకాలు రామాయణం, మహాభారతం వంటి కథలుగా లిఖించబడుతాయి. – చిన్నోళ్ల ప్రవీణ్ రాంపూర్
బీజేపీ అధికారంలోకి వస్తే కట్టెల పొయ్యి..
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే మన ఆడబిడ్డలకు కట్టెల పొయ్యే దిక్కయితది. రూ. 400 ఉన్న సిలిండర్ ధర బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత రూ. 1200కి చేరింది. మన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడబిడ్డలకు ఇబ్బందులు కావొద్దనే కంటి వెలుగు కార్యక్రమం ప్రారంభించిన్రు. రాష్ట్ర ప్రభుత్వం కంటి పరీక్షలు చేయిస్తే, బీజేపీ సిలిండర్ ధరలు పెంచి పేదల జీవితాల్లో చీకటి నింపుతున్నది. – అక్షర, ఎంపీపీ