తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా పది నియోజవర్గాలు ఉండగా.. బోథ్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్.. ఆదిలాబాద్, నిర్మల్, ముథోల్, సిర్పూర్ కాగజ్నగర్లలో బీజేపీ.. మంచిర్యాల, చెన్నూర్, బెల్లంపల్లి, ఖానాపూర్లలో కాంగ్రెస్ పార్టీల అభ్యర్థులు గెలుపొందారు. ఖానాపూర్, కాగజ్నగర్, ఆదిలాబాద్లలో బీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు.
బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సిర్పూర్ కాగజ్నగర్లో ఘోర పరాజయాన్ని చవి చూశారు. మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. కాగా.. పాయల్ శంకర్, అనిల్ జాదవ్, వెడ్మ బొజ్జు, రామారావుపటేల్, ప్రేంసాగర్రావు, వివేక్ వెంకటస్వామి, పాల్వాయి హరీశ్బాబు కొత్తగా అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గెలుపొందిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బ్యాండ్ మేళాల మధ్య నృత్యాలు చేశారు. పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకున్నారు.
– ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ)
మంచిర్యాల, డిసెంబర్ 3(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆసిఫాబాద్లో కోవ లక్ష్మి 22,810 ఓట్లు, బోథ్లో అనిల్ జాదవ్ 23,023 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ నాలుగు నియోజకవర్గాల్లో విజయం సాధించింది. చెన్నూర్లో గడ్డం వివేక్, బెల్లంపల్లిలో గడ్డం వినోద్, మంచిర్యాలలో ప్రేమ్సాగర్రావు, ఖానాపూర్లో వెడ్మ బొజ్జు గెలుపొందారు. నిర్మల్లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్రెడ్డి, ముథోల్లో రామారావుపటేల్, ఆదిలాబాద్లో పాయల్ శంకర్, కాగజ్నగర్ పాల్వాయి హరీశ్బాబు విజయం సాధించారు.
సిర్పూర్, ఖానాపూర్, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ గట్టి పోటీని ఇచ్చింది. చివరి రౌండ్ ఓట్ల లెక్కింపు వరకు ఉత్కంఠగా ఎదురు చూడాల్సి వచ్చింది. ఈ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు స్వల్ప తేడాతో ఓడిపోయారు. అనూహ్యంగా ఈ మూడు నియోజకవర్గాల్లో రెండు చోట్ల బీజేపీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఐపీఎస్ అధికారి సిర్పూర్ కాగజ్నగర్లో ఘోర పరాజయాన్ని చవి చూశారు. ఇక్కడ అతి తక్కువ మెజార్టీతో బీజేపీ గెలిస్తే, బీఆర్ఎస్ రెండో స్థానంలో నిలిచింది. బీఎస్పీ మూడోస్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.
ఉమ్మడి జిల్లాలోని మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ స్వల్ప తేడాతో సీట్లను కోల్పోయింది. ఖానాపూర్ నియోజకవర్గంలో 4,966 ఓట్ల తేడా వచ్చింది. బీఆర్ఎస్ అభ్యర్థి జాన్సన్ నాయక్కు 53,721 ఓట్లు రాగా, కాంగ్రెస్ అభ్యర్థి వెడ్మ బొజ్జుకు 56,687 ఓట్లు వచ్చా యి. కాగజ్నగర్లో బీఆర్ఎస్ గెలిచినంత పని చేసింది. ఇక్కడ కేవలం 3,223 ఓట్లతో బీఆర్ఎస్ అభ్యర్థి కోన ప్ప గెలుపునకు దూరంగా ఉండిపోయారు. ఇక్కడ బీజేపీకి 63,402 ఓట్లు రాగా బీఆర్ఎస్కు 60,169 ఓట్లు వచ్చాయి. ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఓట్ల లెక్కిం పు ప్రారంభమైనప్పటి నుంచి నెక్ టూ నెక్ పోటీ వచ్చిం ది. చివరకు 6,147 ఓట్లతో బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ గెలిచారు. ఈ మూడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అతి దగ్గర వరకు వచ్చి ఓటమి చూడాల్సి వచ్చింది.
ఈ ఎన్నికల్లో చెన్నూర్ ప్రజలు ఇచ్చిన తీర్పును తాను గౌరవిస్తున్నానని చెన్నూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బాల్క సుమన్ అన్నారు. కౌంటింగ్ సెంటర్ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం పని చేసిన నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. గత ఎన్నికల్లో గెలిపించి ప్రజలు తనకు ఇచ్చిన అవకాశాన్ని 100 శాతం ప్రజా సేవకు కేటాయించానన్నారు. చెన్నూర్ నియోజకవర్గ అభివృద్ధికి, ప్రజల సంక్షేమానికి కృషి చేశానన్నారు. ఏదేమైనా ప్రజల తీర్పుకు కట్టుబడి ఉన్నామన్నారు. గెలిచిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేదిశగా పని చేయాలని ఆకాంక్షించారు.
– బాల్క సుమన్, చెన్నూర్ బీఆర్ఎస్ అభ్యర్థి.
బీఆర్ఎస్ : కోనేరు కోనప్ప – 60,614
బీజేపీ : పాల్వాయి హరీశ్బాబు – 63,702
బీఎస్పీ : ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ – 44,008
బీజేపీకి మెజార్టీ – 3,088
బీఆర్ఎస్: బాల్క సుమన్ -50,026
కాంగ్రెస్: వివేక్ వెంకటస్వామి-87,541
బీజేపీ: దుర్గం అశోక్ -3,375
కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ -37,515
కాంగ్రెస్: అజ్మీరా శ్యామ్నాయక్ – 60,242
బీజేపీ: ఆజ్మీరా ఆత్మారాంనాయక్ -6,613
బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ – 22,810
బీఆర్ఎస్: కోవ లక్ష్మి – 83,052
బీఆర్ఎస్ : అనిల్ జాదవ్- 76,297
బీజేపీ : సోయం బాపురావ్- 53,274
కాంగ్రెస్ : ఆడె గజేందర్ – 32,426
బీఆర్ఎస్ పార్టీకి మెజార్టీ – 23,023
బీఆర్ఎస్ : జోగు రామన్న – 60,321
బీజేపీ : పాయల్ శంకర్ – 66,468
కాంగ్రెస్ : కంది శ్రీనివాస్రెడ్డి – 46,763
బీజేపీ పార్టీకి మెజార్టీ – 6,147
బీఆర్ఎస్ : విఠల్రెడ్డి- 73,380
బీజేపీ : రామారావు పటేల్ – 96,799
కాంగ్రెస్ : నారాయణరావు పటేల్ – 15,394
బీజేపీ పార్టీకి మెజార్టీ – 23,419
బీఆర్ఎస్ : ఇంద్రకరణ్రెడ్డి- 55,867
బీజేపీ : ఏలేటి మహేశ్వర్రెడ్డి – 1,06,313
కాంగ్రెస్ : శ్రీహరిరావు- 28,332
బీజేపీకి మెజార్టీ – 50,446
కాంగ్రెస్ : గడ్డం వినోద్ – 82,217
బీఆర్ఎస్ : దుర్గం చిన్నయ్య – 45,339
బీజేపీ : అమర్రాజుల శ్రీదేవి -3,812
కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ – 36,878
కాంగ్రెస్ : ప్రేమ్సాగర్రావు – 1,05,940
బీజేపీ : ఎర్రవెల్లి రఘునాథ్ – 39,829
బీఆర్ఎస్ : దివాకర్రావు -37,989
కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ – 66,111
బీఆర్ఎస్ : జాన్సన్ నాయక్ – 54,152
కాంగ్రెస్: వెడ్మ బొజ్జు – 58,855
బీజేపీ: రమేశ్ రాథోడ్ – 52,378
కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ – 4,703