కాసిపేట, ఏప్రిల్ 13 : అన్ని వర్గాలకూ గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని, తల్లి గర్భంలోనున్న శిశువు నుంచి వృద్ధుల వరకూ సంక్షేమ పథకాలు అమ లు చేస్తున్నదని బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాల కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాల ఇన్చార్జి నారదా సు లక్ష్మణ్రావు, బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. గురువారం కాసిపేట మండలం ముత్యంపల్లిలోని క్రీడా మైదానంలో ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి 10 గ్రామ పంచాయతీల నుంచి కార్యకర్తలు, నా యకులు, ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
మొ దట మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు సీఎం కేసీఆర్ పంపిన సందేశాన్ని చదివి వినిపించారు. అనంత రం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తు న్న పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసమే టీఆర్ఎస్.. బీఆర్ఎస్గా మారిందని, అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మ నందరిపై ఉందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ కుట్రలను తిప్పి కొట్టి బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రతిపక్ష పార్టీలు గొప్పలు చెప్పడం తప్ప.. చేసిందేమీ లేదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు.
కాంగ్రెస్, బీజేపీలవి నీచమైన రాజకీయాలు : బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య
తెలంగాణ రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకెళ్తుంటే ఓర్వలేని కాంగ్రెస్, బీజేపీలు నీచమైన రాజకీయాలు చేస్తున్నాయని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య మండిపడ్డారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నదని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి వారి వల్ల రాజకీయాలు కలుషితమయ్యాయని ఆరోపించారు. కుట్రలు చేసి, అబద్ధాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, ప్రజలు మోసపోవద్దని సూచించారు. కార్యకర్తలే బీఆర్ఎస్కు బలం.. బలగమని, పార్టీ గెలుపుకోసం ప్రతి ఒక్కరూ క ష్టపడాలని సూచించారు. తెలంగాణలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక గ్యాస్ ధర రూ.400 నుంచి రూ.1200కు పెంచిందని, నిత్యావసరాల వస్తువుల ధరలు సైతం ఆకాశాన్నంటుతున్నాయని మండిపడ్డారు. కేంద్రం పెట్టుబడి దారులకు మద్దతు ఇస్తున్నదని, ప్రభుత్వ రంగ సంస్థలను ్రప్రైవేటు వ్యక్తులకు అప్పగిసున్నదని చెప్పుకొచ్చారు. కేంద్రం ప్రజల నడ్డి విరుస్తుంటే..
తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారి సంక్షేమేమే ధ్యేయంగా ముందుకెళ్తున్నదని కొనియాడారు. ఢిల్లీకి గులాం చేసే వారు ప్రజలకు ఏం చేస్తారన్నారు. ఛీటర్స్ను అడ్డుపెట్టుకొని తనపై దుష్ప్రచారాలు చేస్తున్నారని, ప్రజలెవ్వరూ నమ్మరని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. బెల్లంపల్లిపై చాలా మంది కన్నేసి బీఆర్ఎస్ను, తనను దెబ్బ కొట్టడానికి కుట్రలు, కుతంత్రాలు చేస్తున్నారన్నారు. 2018లో డబ్బుల సంచులతో వచ్చిన వారికి ప్రజలు గుణపాఠం చెప్పి.. తనను ఆశీర్వదించారని, బతికున్నంత వరకూ వారికి సేవలు చేస్తానని చెప్పారు. బెల్లంపల్లిలో బీఆర్ఎస్ 50 వేల కార్యకర్తలతో స్ట్రాం గ్గా ఉందని, ఎవ్వరు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు తిప్పి కొడుతారన్నారు. ముత్యంపల్లిలో ఐకేపీ భవనం, గురువాపూర్లో రోడ్డు నిర్మాణాల కోసం స్థానికులు విన్నవించగా హామీ ఇచ్చారు. అనంతరం 50 మంది బీఆర్ఎస్ పార్టీలో చేరగా, ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వారికి పా ర్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సంక్షేమ పథకాలను వివరిస్తూ కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పల్లె చంద్రయ్య, ఎంపీపీ రొడ్డ లక్ష్మి, వైస్ ఎంపీపీ పూస్కూరి విక్రంరావు, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బొల్లు రమ ణారెడ్డి, రైతుబంధు అధ్యక్షుడు దుర్గం పోశం, సహకార చైర్మన్ నీలా రాంచందర్, ఎంపీటీసీలు కొండబత్తుల రాంచందర్, అక్కెపల్లి లక్ష్మి, సర్పంచ్లు ఆడె బాదు, రాంటెంకి శ్రీనివాస్, సపాట్ శంకర్, దుస్స విజయ, ఆడె జంగు, అజ్మీర తిరుపతి, స్వప్న, బీఆర్ఎస్ కా ర్యదర్శి మోటూరి వేణు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మం జులారెడ్డి, ఉప సర్పంచ్లు బోయిని తిరుపతి, పిట్టల సుమన్, పానగంటి అశోక్, ఓసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏనుగు తిరుపతిరెడ్డి, అట్టెపల్లి శ్రీనివాస్, అగ్గి సత్తయ్య, జాడి రాంచందర్, మాజీ జడ్పీటీసీ రౌత్ సత్తయ్య, కోఆప్షన్ సిరాజ్ఖాన్, నర్సింగం, లంక లక్ష్మణ్, వాస్దేవ్, ప్రేంకుమార్, మద్దివేణి వేణు, సురేందర్ పాల్గొన్నారు.