సీసీసీ నస్పూర్, ఏప్రిల్ 29 : లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ రోజు రోజుకూ పెరిగిపోతున్నదని పార్టీ నాయకులు పేర్కొంటున్నారు. ప్రచారం సందర్భంగా ప్రజల నుంచి స్పందన లభిస్తున్నదని, తప్పకుండా పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. నస్పూర్ మున్సిపల్ పరిధిలోని 10, 11వ వార్డుల్లో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సోమవారం సాయంత్రం విలేజ్ నస్పూర్, అంబేద్కర్కాలనీ, తదితర ప్రాంతాల్లో ఇంటింటా తిరిగి కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు.
ఈ సందర్భంగా నడిపెల్లి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ విజిత్రావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య మాట్లాడుతూ.. మోసపూరితమైన వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్కు పార్లమెంట్ ఎన్నికల్లో ఓటుతో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎస్సీ సెల్ పట్టణాధ్యక్షుడు గరిసె రామస్వామి, కౌన్సిలర్లు వంగ తిరుపతి, జబీన్హైమద్, కుర్మిల్ల అన్నపూర్ణ, మాజీ వైస్ ఎంపీపీ పానుగంటి సత్తయ్య, మాజీ సర్పంచులు మల్లెత్తుల రాజేంద్రపాణి, గుంట జగ్గయ్య, ముత్తె రాజేశం, నాయకులు కేతిరెడ్డి సురేందర్రెడ్డి, జాబ్రిగౌస్, గరిసె భీమయ్య, రవిగౌడ్, తోట దుర్గాప్రసాద్, అన్వేష్రెడ్డి, జనార్దన్, ఆకునూరి సంపత్, బండారి తిరుపతి, రుకుం తిరుమల్, పెరుక సత్తయ్య, జాడి భానుచందర్, పెద్దపల్లి వెంకటేశ్వర్లు, రామన్న, కాటం రాజు, ఆకుల రమేశ్, మాడుగుల కిరణ్, తదితరులు పాల్గొన్నారు.
చెన్నూర్, ఏప్రిల్ 29 : బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాల మేరకు చెన్నూర్ పట్టణంలో నాయకులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని 12,13వ వార్డుల్లో ఇంటింటికీ వెళ్లి, కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికల్లో ఇచ్చిన మోసపూరిత వాగ్ధానాలను ప్రజలకు వివరించారు. బీఆర్ఎస్ పార్టీ పెద్దపెల్లి ఎంపీ అభ్యర్థి కొప్పల ఈశ్వర్కు ఓటు వేసి, భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు రేవెల్లి మహేశ్, జోడు శంకర్, జగన్నాధుల శ్రీను, బీఆర్ఎస్ నాయకులు రాంలాల్ గిల్డా, మేడ సురేశ్రెడ్డి, అయూబ్ తదితరులు పాల్గొన్నారు.
మందమర్రి, ఏప్రిల్ 29 : మందమర్రి పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఆదివారం రాత్రి ఇంటింటా ప్రచారం చేశారు. స్థానిక టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద ప్రారంభమైన ప్రచారం.. మార్కెట్, ఒకటో జోన్ పరిసర కా ర్మిక కాలనీల్లో సాగింది. రాష్ట్ర అభివృద్ధి, ప్ర జా సంక్షేమం బీఆర్ఎస్తోనే సాధ్యమని పే ర్కొన్నారు. పెద్దపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ను గెలిపించాలని కోరారు. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసి న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించా రు.
మార్కెట్లో నిర్వహించిన ప్రచార ఊరేగింపులో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తు న నినాదాలు చేశారు. దుకాణాలకు వెళ్లి వ్యా పారులతో పాటు వినియోగదారులకు ప్రచార కరపత్రాలను అందించి మద్దతు తెలిపాలని కోరారు. బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే రవీందర్, టీబీజీకేఎస్ ఏరియా ఉపాధ్యక్షుడు మేడిపల్లి సంపత్, సీనియర్ నాయకులు ఈశ్వర్, మద్ది శంకర్, బర్ల సదానందం, మేడిపల్లి మల్లేశ్, సీపెల్లి రాజలింగు, చేపూరి లక్ష్మ ణ్, వేల్పుల కిరణ్, కనకం రవీందర్, సీపెల్లి సాగర్, బెల్లం అశోక్, పూసాల ఓదెలు, మొ గురం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.