ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతున్నది. అభ్యర్థులు జోగు రామన్న, అనిల్ జాదవ్, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, విఠల్రెడ్డి, జాన్సన్ నాయక్తో పాటు శ్రేణులు.. జెండాలు చేతబూని విస్తృతంగా పర్యటిస్తుండగా, వాడలన్నీ గులాబీమయమవుతున్నాయి.
ఇంటింటికీ వెళ్లి అభివృద్ధితో పాటు మ్యానిఫెస్టో గురించి వివరిస్తూ ఓట్లు అభ్యర్థిస్తుండగా, అనూహ్య స్పందన వస్తున్నది. మరోసారి సంక్షేమ సర్కారుకే జై కొడుతామంటూ స్పష్టం చేస్తున్నారు. ఇక ఆయా పార్టీల నుంచి వలసలు కొనసాగుతుండగా, రోజు రోజుకూ కారుకు మద్దతు పెరుగుతున్నది.