ఉట్నూర్, మే 2 : కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలోనన్న ఆలోచనలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉంటారని, ఆయనది అభివృద్ధి మంత్రమని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల ఆత్మీయ సమ్మేళనాల ఇన్చార్జి, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ పేర్కొన్నారు. ఉట్నూర్లోని హెచ్కేజీఎన్ ఫంక్షన్హాల్లో మంగళవారం ఎమ్మెల్యే రేఖానాయక్ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని, అక్రమాన్ని కేసీఆర్ బయటపెడుతూ ప్రజలతో కలిసి ఉద్యమాలు చేపట్టారన్నారు. ఫలితంగా రాష్ట్రం సాధించామని పేర్కొన్నారు. అలాంటి రాష్ర్టా న్ని అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతున్నారని తెలిపా రు. ఇందులో భాగంగానే రైతులకు పెట్టుబడి సాయం వచ్చిందన్నారు. ఈ పథకం నేడు బీజేపీ దేశమంతా అమలు చేస్తున్నదని పేర్కొన్నారు. దేశానికి ఆదర్శవంతమైన పథకాలు సృష్టించడంలో మేటి కేసీఆర్ అన్నారు. అందులో భాగంగా రైతుబం ధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, మిషన్ కాకతీ య, మిషన్ భగీరథ లాంటి పథకాలు వచ్చాయని పేర్కొన్నా రు.
దేశానికి గ్రామాలే పట్టుగొమ్మలని నమ్మిన కేసీఆర్ ..పారిశుధ్య పనులు, డంప్ యార్డులు, శ్మశాన వాటికలు, చెరువుల్లో పూడికతీత, ఇంటింటికీ తాగునీరు, గ్రామాల్లో మొక్కల పెం పకం, త్రీఫేజ్ విద్యుత్ కనెక్షన్ లాంటివి అమలు చేస్తున్నారని తెలిపారు. ఒకప్పుడు పల్లెల నుంచి పట్టణాలకు ప్రజలు పరుగులు పెడుతుండేవారని, నేడు తిరిగి పల్లెలకు చేరుతున్నారని చెప్పారు. రైతుబంధు పథకం ద్వారా రైతులు అప్పులు చేసే ప నిలేకుండా పోయిందన్నారు. భూముల ధరలు చాలా పెరిగాయన్నారు. వృద్ధులు, వికలాంగులు, బీడీ కార్మికులకు ఆసరా అందిస్తూ వారి జీవన ప్రమాణాలు పెంచారన్నారు. రాష్ట్రంలో ని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ధి విద్య, వైద్యం అందిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామాల్లో అభివృద్ధికి కేంద్రం అవార్డులు ఇవ్వాల్సి వస్తున్నదని, దేశంలో గ్రామ పంచాయతీలకు అవార్డులు ఇస్తే తెలంగాణ రాష్ర్టానికే ఎక్కువ దక్కడం మన పనితనానికి నిదర్శనమన్నారు. గ్రామగ్రామాన బీఆర్ఎస్కు దళం.. బలం కార్యకర్తలేనని పేర్కొన్నారు. కార్యకర్తలు ఎమ్మె ల్యే ఆధ్వర్యంలో తెలంగాణ పథకాలతో కరపత్రాలు ముద్రించి ఇంటింటికీ అందజేయాలని తెలిపారు. మన పథకాలు తీసుకోని ఇల్లు లేదన్నారు. కార్యకర్తలు సమానత్వంతో ముందుకెళ్లి వచ్చే ఎన్నికల్లో హ్యాట్రిక్ దశగా అడుగు వేయాలన్నారు.
ఎలా ఓట్లు అడుగుతారు?
రాష్ట్రంలో ప్రతి పక్షాలు ఏం ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. రాష్ర్టానికి బీజేపీ ఎన్ని నిధులు తెచ్చిందో చెప్పాలన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎంపీగా ఉన్న వ్యక్తి ఒక్కరోజైనా అభివృద్ధికి నిధులు అడిగారా? అని ప్రశ్నించారు. బీజేపీది అధికార దాహం తప్ప మరొకటి కాదన్నారు. ఎప్పుడూ ప్రభుత్వాన్ని, కేసీఆర్ను విమర్శడం పనిగా పెట్టుకున్నారని దుయ్యబట్టారు. ఒక ఎంపీ పసుపు బోర్డు తెస్తానని చెప్పి బాండ్ పేపర్ రాసిచ్చి ఇప్పటి వరకు తేలేదన్నారు. ఇక ఉమ్మడి జిల్లాలో ఎన్నో రోడ్లు మంజూరవుతున్నా ఫారెస్ట్ అనుమతులు లేక ఆగిపోయాయన్నారు. మనం అభివృద్ధి చేసుకుందామని చూస్తుంటే కేంద్రంలోని బీజేపీ అడ్డుతగులుతుందన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సుందరంగా సచివాలయం కట్టుకుంటే బండి సంజయ్ కూల్చేస్తామంటున్నాడని, పెట్రోల్, డీజిల్ రేట్లు పెంచుతున్నది వారి ప్రభుత్వం కాదా? అని ప్రశ్నించారు. తెలంగాణకు గిరిజన యూనివర్సిటీ ఏదని ప్రశ్నించారు. పదోతరగతి పరీక్షల లీక్ల పనులు ఎవరివని ప్రశ్నించారు. ఇక కాంగ్రెస్ పని ఖతమైందన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ సామ ప్రభాకర్రెడ్డి, వైస్ ఎంపీపీ బాలాజీ, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు కందుకూరి రమేశ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అహ్మద్ అజీం, మాజీ జడ్పీటీసీ జగ్జీవన్రాం, మాజీ సర్పంచ్ బొంత ఆశారెడ్డి, నాయకులు సెడ్మకి సీతారాం, ధరణి రాజేశ్, స్వామి, అంకవ్వ, కళావతి, సతీశ్, పోశన్న, పోశవ్వ, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఏజెన్సీ మరణాలు ఆపేశాం..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్షాకాలం వచ్చిందంటే గిరిజ న ప్రాంతాల్లో మరణాలు సంభవించేవని, ఇప్పుడు కనిపిస్తున్నాయా? అని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అ న్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఏజెన్సీలోని మరణాలను అరికట్టేందుకు ప్రతి మండలాన్ని ఎమ్మెల్యే, ఎంపీలకు దత్తత ఇచ్చారని, మరణాలు లేకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చూశారన్నారు. ఏజెన్సీకి ఎక్కువ నిధులి స్తూ పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించారన్నారు. గతం లో కన్నా గిరిజన గ్రామాలు చాలా అభివృద్ధిలో ముందుకు సాగుతున్నాయన్నారు. మిషన్ భగీరథతో ఇంటింటికీ తాగునీరు, మిషన్ కాకతీయతో పంట పొలాలకు సాగునీరు అం దిస్తున్నారని తెలిపారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఆసరా పింఛన్లతో పాటు గ్రామాల్లో అనేక పథకాలు అమలవుతున్నాయన్నారు. వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించి కేసీఆర్ రుణం తీర్చుకుంటానని చెప్పారు.
చిన్న జీపీల ఏర్పాటు ఘనత కేసీఆర్దే..
గిరిజనుల అభివృద్ధికి కేసీఆర్ కృషి చేస్తున్నారని, ఏజెన్సీలోని మారుమూల గిరిజన గ్రామాలను చిన్నచిన్న జీపీలుగా చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. గిరిజనుల్లో స్వయం పరిపాలన అందించేందుకు చిన్న జీపీలు చాలా ఉపయోగపడ్డాయని పేర్కొన్నారు. ఎన్నడూ లేని విధంగా గ్రామాలకు రోడ్లు, వంతెనలు వచ్చాయన్నారు. వాగుల్లో నీరుతాగే పరిస్థితి నుంచి నల్లాలు అందించే వరకు వచ్చాయని తెలిపారు. ఏజెన్సీలో వర్షాధారిత పంటలపై గిరిజనులు ఆధారపడి జీవిస్తున్నారని, అందుకే కరువు ప్రాంతంగా మారిందన్నారు. ఈ ఏరియాల్లో ప్రాజెక్ట్ల నిర్మాణం చేపడితే రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. మైదాన ప్రాంతాలతో ఈ ఏరియా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. సీఎం దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లాలని కోరారు. గతంలో పనిచేసిన ఎమ్మెల్యేలు అభివృద్ధిని మరిచారని, వారికి ఓట్లు అడిగే హక్కు లేదని రేఖానాయక్ పేర్కొన్నారు.