ఆసిఫాబాద్, ఫిబ్రవరి 15: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణలో భాగంగా వీడియో, స్టాటిక్ సర్వైవ్లెన్స్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాల పాత్ర ఎంతో కీలకమని కలెక్టర్ బొరడే హేమంత్ సహదేవరావు అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశం మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో కలిసి ఆయా విభాగాల సిబ్బందికి ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమానికి గురువారం హాజరయ్యారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ప్రత్యేక బృందాలు తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. వీడియో సర్వైవ్లెన్స్, స్టాటిక్ సర్వైవ్లెన్స్, ఫ్లయింగ్ స్వాడ్ బృందాల సభ్యులు, చెక్ పోస్టుల సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో శిక్షణ నోడల్ అధికారి, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి రమాదేవి, ఆయా విభాగాల అధికారులు పాల్గొన్నారు.