బోథ్, జూలై 14 : బీఎల్వోలు జాగ్రత్తగా ఓట్లు పరిశీలించాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా బోథ్లో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్వోల ఫైళ్లు, ఫారాలను పరిశీలించారు. స్థానిక ప్రజలతో మాట్లాడుతూ వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవగాహన కల్పించాలని, ఇతర ప్రాంతాల్లో నివసిస్తున్న ఓటర్లకు సమాచారం అందించి వారి ప్రక్రియ పూర్తి చేసేలా బాధ్యతలు తీసుకోవాలని ఆదేశించారు.
డబుల్ ఓట్లను గుర్తించి నిజమైన ఓటర్లకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుభాష్ చందర్, ఎంపీడీవో రమేశ్, మాజీ ఎంపీపీ తుల శ్రీనివాస్, నాయకులు స్వామి, శ్రీధర్ రెడ్డి, సురేందర్ యాదవ్, రవీందర్, బాబులాల్, పోతన్న, ఎలుక రాజు, మల్లెపూల సుభాష్, రమణ గౌడ్, అల్లకొండ ప్రశాంత్, రఫీ, సంజీవ్, బాపురెడ్డి, వినయ్, ఇఫ్తేకార్, గోపాల్, సందీప్, మామిడి సంతోష్ తదితరులు పాల్గొన్నారు.