నిర్మల్ అర్బన్, అక్టోబర్ 7 : రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడుతున్నదని, అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు పట్టం కడుతారని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్లోని 1, 23, 36, 37, 38 వార్డులకు సంబంధించి బుధవార్ పేట కాలనీలో, వార్డు నంబర్ 3, 4, 5, 24, 25లకు సంబంధించి బంగల్పేట్లో సీసీరోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్మల్లోని 42 వార్డుల్లో వందల కోట్ల నిధులతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, కమ్యూనిటీ హాల్ నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని అన్నారు. ఇప్పటికే అనేక వార్డుల్లో కమ్యూనిటీ హాళ్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయన్నారు. మైనార్టీ కమ్యూనిటీ హాళ్ల నిర్మాణానికి రూ. 5 కోట్లు, క్రిస్టియన్ కమ్యూనిటీలకు రూ.2 కోట్ల నిధుల మంజూరుకు సంబంధించిన జీవోలను ప్రభుత్వం విడుదల చేసిందని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం అమలు చేయని సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పక్కనే ఉన్న మహారాష్ట్ర వాసులు తెలంగాణలో కలపాలని కోరుతున్నారని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో ఇక్కడి ప్రజలకు ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయన్నారు. కొట్లాడి సాధించుకున్న మన రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు. పని చేసే ప్రభుత్వాలు ఎవరో…ఓట్లు అడిగే పార్టీలు ఎవరో అందరికీ తెలుసని అన్నారు. వార్డుల్లో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసిన మంత్రిని శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, కౌన్సిలర్లు గండ్రత్ రమణ, బిట్లింగ్ నవీన్, ఎడిపెల్లి నరేందర్, పూదరి రాజేశ్వర్, వేణు, నరేందర్, నాయకులు మేడారం ప్రదీప్, అప్పాల గణేశ్ చక్రవర్తి, తదితరులు పాల్గొన్నారు.
నిర్మల్ టౌన్, అక్టోబర్ 7 : తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి చేరుకున్నాయని, అభివృద్ధి చేసే పార్టీకి ప్రజలు అండగా ఉండాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. శనివారం నిర్మల్ కలెక్టరేట్ సమీకృత భనవంలో బీసీ, మైనార్టీబంధు కింద మంజూరైన రూ. లక్ష చెక్కులను 301 మంది లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండో విడుత కింద బీసీ, మైనార్టీ బంధు కింద మొత్తం జిల్లాకు రూ.6 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. ఒక్కొక్క నియోజకవర్గానికి రూ. 2 కోట్ల చొప్పున అందజేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం తొమ్మిదిన్నరేండ్లలో పేద ప్రజల అభివృద్ధే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేసిందని గుర్తు చేశారు. ఇండ్లు లేని వారికి డబుల్బెడ్రూం ఇండ్లు, ఇంటి స్థలం ఉన్న వారికి గృహలక్ష్మి, కులవృత్తుల వారికి ఆర్థిక సాయం వంటి పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగిస్తామని, బీసీ, మైనార్టీ బంధు రాని వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ వరుణ్రెడ్డి, అదనపు కలెక్టర్ కిశోర్కుమార్, ఆర్డీవో రత్నకల్యాణి, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు సుభాష్రావు, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజేశ్వర్గౌడ్, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి మోహన్సింగ్, అధికారులు ఖలిక్, సృజన్ పాల్గొన్నారు.