నెన్నెల, జూన్ 2 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా చిత్తాపూర్వాసులు ముందుకు వచ్చి తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేసుకోవడం గర్వంగా ఉందని బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య అన్నారు. ఈ గ్రామస్తులందరూ ఆదర్శవంతులని పేర్కొన్నారు. గ్రామస్తులు ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామాలు ఎలా అభివృద్ధి చెదాయో ఇలాంటి కార్యక్రమాలు చూస్తే తెలుస్తున్నాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రజా సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయని, ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరుతున్నాయని తెలిపారు.
ఈ నెల 22వ తేదీ వరకు ప్రతి రోజూ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయన్నారు. వాటిపై ప్రజలకు వివరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సంతోషం రమాదేవి, జడ్పీటీసీ శ్యామల, సర్పంచ్ బత్తిని పద్మ, పీఏసీఎస్ చైర్మన్ మేకల మల్లేశ్, రైతు బంధు సమితి అధ్యక్షుడు అశోక్గౌడ్, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సాగర్గౌడ్, ఎంపీటీసీ కమల, నాయకులు రాంచందర్, ప్రతాప్రెడ్డి, వెంకటేశ్, చీర్ల మొండన్న, పాపయ్య, కామెర శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.