జన్నారం, డిసెంబర్ 13 : మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించడాన్ని రద్దు చేయాలని కోరుతూ మండల కేంద్రంలో మండల ఆటో, టాటా ఏసీ,జీప్ డ్రైవర్ల యూనియన్ ఆధ్వర్యంలో స్థానిక ఆటో స్టాండ్ వద్ద ప్రధాన రోడ్ పక్కన ఆటోలను నిలిపి యూనియన్ నాయకులు మోకాళ్లపై నిలుచొని నిరసన తెలిపారు. ఈసందర్భంగా అధ్యక్షుడు నసిరోద్దిన్,షేక్ బాబాలు మాట్లాడారు.
మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించడం వలన ఆటోల్లో ప్రయాణికులు ఎవరు ఎక్క క పోవడంతో తాము ఆర్థికంగా నష్టపోతున్నామన్నారు. రాష్ట్ర ప్రభు త్వ వెంటనే స్పందించి తమకు తగిన న్యాయం చేయాలన్నారు. ఈకార్యక్రమంలో ప్రభుదాస్, మొగిళి,రాజన్న, శంకర్, చాంద్పాషా,లక్ష్మన్ ఆటో యూనియన్ నాయకులు పాల్గొన్నారు.
ముథోల్, డిసెంబర్, 13: ముథోల్ ప్రభుత్వం మహిళలకు ఉచితంగా బస్సు ప్రయాణం కల్పించడంతో తాము రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆటో యూనియన్ సభ్యులు పేర్కొన్నారు. బుధవారం ముథోల్లోని నయాబాది చౌరస్తాలో ముథోల్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ ఆటోల్లో ఎక్కువగా ప్రయాణించేది మహిళలేనని ప్రభుత్వం ఉచిత ప్రయాణం కల్పించడంతో తాము ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొవాల్సిన దుస్థితి నెలకొందని ఆవే దన వ్యక్తం చేశారు. ఆటోలు నడిపి బతికే మాకు ఇదో చావు దెబ్బ లాంటిదన్నారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సభ్యులు తదితరులు ఉన్నారు.