బేల, మే1 : “భారతదేశంలోనే అత్యధిక పంచాయతీ అవార్డులు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. పల్లెల్లో ప్రగతిని చూసి కేంద్రం అవార్డులు ప్రకటిస్తున్నది. స్థానిక బీజేపీ నాయకులు కండ్లుండి అభివృద్ధి జరగడం లేదంటూ విమర్శించడం హాస్యాస్పదం.” అని ఆదిలాబాద్-నిర్మల్ జిల్లాల కో-ఆర్డినేటర్, ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ స్పష్టం చేశారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా బేల మండలం బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు ప్రమోద్రెడ్డి ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డిలతో కలిసి గంగాధర్ గౌడ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని స్పష్టం చేశారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు కూడా వారికి కావాలని అంటున్నారని, లేకపోతే తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు.
దేశంలోనే అత్యధిక ఉత్తమ పంచాయతీ అవార్డులు సాధించిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధిని గుర్తించి ఓ వైపు ఢిల్లీలో అవార్డులు ప్రధానం చేస్తుంటే, స్థానిక బీజేపీ నేతలు అభివృద్ధి జరగడం లేదంటూ విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల కోఆర్డినేటర్ ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్ అన్నారు. బేలలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కళ్యాం ప్రమోద్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆదిలాబాద్ , నిర్మల్ జిల్లా కోఆర్డినేటర్ గంగాధర్గౌడ్, ఆదిలాబాద్ జడ్పీచైర్మన్ రాథోడ్ జనార్దన్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు. మండల నాయకులు, కార్యక్తరలు పార్టీ నేతలకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్ మాట్లాడారు. ఆదిలాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూడలేకనే బీజేపీ , కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారని అన్నారు.
గ్రామాల్లో జరుతున్న అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి పక్ష నాయకులకు బీఆర్ఎస్ కార్యకర్తలు చూపించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో మన రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదన్నారు. మన సంక్షేమ పథకాలను చూసి పక్క రాష్ర్టాల ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని అడుగుతున్నారని, లేకపోతే తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. యావత్ దేశం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం ప్రభుత్వానికి రెండు కళ్లలాంటివని పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను గుర్తించి ఇతర రాష్ర్టాల ప్రజలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్, ఎమ్మెల్యే జోగు రామన్న సహకారంతో ఆదిలాబాద్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి జరుగుతుంటే, ప్రతి పక్షనాయకులకు కనిపించకపోవడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్ర సచివాలయాన్ని నిర్మించి అంబేద్కర్ పేరు పెట్టి అట్టహాసంగా ప్రారంభించారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సచివాలయాన్నే కూల్చేస్తామని వ్యాఖ్యలు చేయడం రాజకీయ కుటిల నీతికి అద్దం పడుతున్నదన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ఇక్కడి పథకాలు ఎక్కడైనా ఉన్నాయా?
ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న ఆసరా పింఛన్లు, కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, గొర్రెల పంపిణీలాంటివి ఎన్నో ఉన్నాయన్నారు. కడుపులో ఉన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు పథకాలు అమలు చేస్తున్నారని చెప్పారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా ఇక్కడి పథకాలు అమలవుతున్నాయా అని ప్రశ్నించారు.
ఉద్యోగా కల్పనలో భేష్..డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి
ఉద్యోగాల విషయంలో ప్రతిపక్షాలు యువతను తప్పుదోవ పట్టిస్తున్నాయని డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి దాదాపు లక్షకు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసినట్లు చెప్పారు. మరెన్నో నోటిఫికేషన్లు జారీ చేస్తున్నట్లు వెల్లడించారు. వీటితో పాటు ప్రైవేట్ రంగంలోనూ లక్షల ఉద్యోగాలు కల్పిస్తున్నామన్నారు. ప్రతి జిల్లాలో ఐటీ పరిశ్రమలు కూడా ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. కానీ బీజేపీ , కాంగ్రెస్ నాయకులు మాత్రం యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి రాగానే ఏటా 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని బీజేపీ విస్మరించిందన్నారు. ఈ విషయమై యువత బీజేపీ నాయకులను ప్రశ్నించాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నిరుద్యోగుల భరోసా యాత్ర అంటూ ఆదిలాబాకు వచ్చారని, అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని, రైతులను ఎందుకు ఆదుకోలేదని ప్రశ్నించారు.
ఓట్లు అడిగే హక్కు బీఆర్ఎస్కే ఉంది ;జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్
రాష్ట్ర ప్రజలను ఓట్లు అడిగే హక్కు కేవలం బీఆర్ఎస్కు మాత్రమే ఉన్నదని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్ అన్నారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశాన్ని, రాష్ర్టాన్ని ఎన్నో ఏండ్లు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదన్నారు. స్కాములతో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని భ్రష్టు పట్టించిందని మండిపడ్డారు. మతాలు, కులాల పేరిట బీజేపీ దేశాన్ని విడగొడుతున్నదన్నారు.అన్ని వర్గాల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తున్నదన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
ఆత్మీయ సమ్మేళనంలో బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ మహమ్మద్ అసీమొద్దీన్ ఎమ్మెల్సీ గంగాధర్గౌడ్, జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన వెంట పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపధను కార్పొరేట్ సంస్థలకు దోచిపెడుతు న్న దని, పేదలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకా లకు ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు గంభీర్ఠాక్రే, సతీశ్ పవార్, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, దేవన్న, మస్కేతేజ్రావు, విపిన్, మంగేశ్ ఠాక్రే, ఆకాశ్ గుండావార్, తాంసి జడ్పీటీసీ తాటిపెళ్లి రాజు, దుర్గం ట్రస్ట్ చైర్మన్ దుర్గం శేఖర్, బీఆర్ఎస్ ఆదిలాబాద్ పట్టణ అధ్యక్షుడు సాజిద్ఖాన్, మండల కోఆప్షన్ సభ్యుడు తన్వీర్ఖాన్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, పీఏసీఎస్ చైర్మన్లు, ఆయా గ్రామాల పార్టీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు , నాయకులు పాల్గొన్నారు.