ఇచ్చోడ, జూన్ 8 : దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం సిరికొండ, ఇచ్చోడ మండలాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. సిరికొండ మండలంలోని సిరికొండ, కొండాపూర్, లక్ష్మీపూర్, వాయిపేట్, పోచంపెల్లి, ఇచ్చోడ మండలంలోని గేర్జం, తలమద్రి, సిరిచెల్మతో పాటు ఆయా గ్రామాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు, ప్రజాప్రతినిధులు చెరువులకు పూజలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన విందులో అధికారులు, ప్రజలు సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు టీ వర్ణ, మోహన్ సింగ్, ఎంపీడీవో సురేశ్, ఎంపీవోలు రమేశ్, అబ్దుల్, కార్యదర్శులు రాజు, అరుణ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
జైనథ్,జూన్8: మండలంలోని 42 గ్రామ పంచాయతీలతో పాటు మండల కేంద్రంలో ఘనంగా ఊరూరా చెరువుల పండుగను ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని శ్రీలక్ష్మీనారాయణ స్వామి ఆలయ ప్రాంగణం నుంచి ఎంపీపీ మార్శెట్టి గోవర్ధన్, జడ్పీటీసీ తుమ్మల అరుంధతి, డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వరీతో పాటు మహిళా సంఘాల సభ్యులు నెత్తిన బోనమెత్తి, సమీప చెరువు వద్దకు ర్యాలీగా డప్పువాయిద్యాలతో తరలివెళ్లారు. కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేంద్రరావు, ఎంపీడీవో గజనన్రావు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్ రెడ్డి, నాయకులు గడ్డం జగదీశ్రెడ్డి, పీ వెంకట్ రెడ్డి, సర్పంచ్ దేవన్న పాల్గొన్నారు.
బేల, జూన్ 8 : మండల కేంద్రంతోపాటు మండలంలోని సోన్ఖాస్, సాంగ్వి, చప్రాల, టాక్లీ తదితర గ్రామాల్లో మహిళలు , నాయకులు బోనాలతో పాటు బతుకమ్మలను డప్పు వాయిద్యాలతో ఊరేగించారు. గ్రామ శివారులో గల చెరువుల్లో నిమజ్జనం చేశారు . అనంతరం చెరువు వద్ద వంట వండుకొని సామూహిక భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, ఎంపీపీ వనితఠాక్రే, జడ్పీటీసీ అక్షిత పవార్, బేల సర్పంచ్ వట్టిపెళ్లి ఇంద్రశేఖర్, ఎంపీడీవో మహేందర్, మహిళా సంఘాల నాయకులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
తాంసి, జూన్ 8 : మండలంలోని జామిడి, బండల్నాగపూర్, కప్పర్ల, ఈదుల్లా సవర్గాం, తాంసి, వడ్డాడి, హస్నాపూర్, గిరిగాం, అంబుగాం, పాలోడి గ్రామాల్లో చెరువుల పండుగ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్ట మైసమ్మ తల్లికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మహిళలు బతుకమ్మలను నిమజ్జనం చేశారు. గోరేటి వెంకన్న పాడిన పాటలను వినిపించారు. జడ్పీటీసీ తాటిపల్లి రాజు, వైస్ ఎంపీపీ ముచ్చ రేఖ-రఘు, సర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
బోథ్, జూన్ 8 : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మండలంలోని చింతల్బోరి, ఖండిపల్లె, కరత్వాడ, పిప్పిల్ధరి తదితర గ్రామాల్లో నిర్వహించిన చెరువుల పండుగ కార్యక్రమాల్లో స్థానిక ప్రజా ప్రతనిధులతో కలిసి ఎంపీపీ తుల శ్రీనివాస్ పాల్గొన్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం పాటు పడుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆదరించాలని కోరారు. అంతకుముందు ఆయా గ్రామాల్లో థింసా, డప్పులు, బ్యాండు భాజాలతో చెరువుల వరకు ఊరేగింపుగా వెళ్లారు. మహిళలు బతుకమ్మ ఆడి సందడి చేశారు. పూజలు నిర్వహించారు. రైతులు, నాయకులు కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. మండల పంచాయతీ అధికారి జీవన్రెడ్డి, సహకార సంఘం చైర్మన్ కే ప్రశాంత్, సర్పంచ్లు సకారాం, శ్రీధర్రెడ్డి, అంగూరిబాయి, చాంగుబాయి, రోహిదాస్, మహిపాల్, రమేశ్, గులాబ్సింగ్ పాల్గొన్నారు.
ఇచ్చోడ, జూన్ 8 : మండలంలోని ముక్రా(కే) గ్రామంలో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. డప్పు చప్పుళ్ల మధ్య చెరువు దగ్గరికి వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అన్నదానం చేశారు. బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గె మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గె సుభాష్, ఏఈవో సంధ్యరాణి, సెక్రటరీ పురుషోత్తం, ఉప సర్పంచ్ వర్ష, తిరుపతి, మాధవ్ పాల్గొన్నారు.
నేరడిగొండ, జూన్ 8 : మండలంలోని ఆయా గ్రామాల్లో చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. మండలంలోని రాజురా గ్రామంలో నిర్వహించిన చెరువుల పండుగకు జడ్పీటీసీ జాదవ్ అనిల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం గ్రామస్తులు ఆయనను శాలువాతో సత్కరించారు. సర్పంచ్ జాదవ్ అనూష, మాజీ సర్పంచ్ సావాయిరాం, పీఏసీఎస్ డైరెక్టర్ రాంచందర్, ఉప సర్పంచ్ దేవేందర్రెడ్డి, నాయకులు వసంత్రావ్, శివాజీ, మాజీ ఎంపీపీ గణేశ్, ఐకేపీ సీసీ విజయ, గ్రామస్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, జూన్ 8 : మండలంలోని అన్ని గ్రామాల్లోని చెరువుకట్టలపై ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పెద్దసంఖ్యలో బతుకమ్మలతో శోభాయాత్ర తీశారు. గంగమ్మతల్లికి ప్రత్యేక పూజలు చేసి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ఎంపీడీవో రాధ, సర్పంచ్లు లావణ్య, లక్ష్మి, అనిత, జ్ఞానేశ్వర్, ఎంపీటీసీ తిరుమల, తహసీల్దార్ సోము, ఎంపీవో మహేందర్రెడ్డి, పంచాయతీ కార్యాదర్శి సునీల్, నవనీత, సాయి, శ్రీకాంత్, లావణ్య, ఐకేపీ, అంగన్వాడీ మహిళలు, ప్రజలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
భీంపూర్, జూన్ 8: మండలంలోని అయా చెరువుల వద్ద ఉత్సాహంగా పండుగ నిర్వహించారు. డప్పువాద్యాల నడుమ బోనాలు, బతుకమ్మలతో గ్రామం నుంచి చెరువుల వద్దకు వచ్చి పూజలు చేశారు. చెరువుకు గంగపుత్రులు, రైతులు సాష్టాంగ నమస్సులు అర్పించారు. మహిళలు కట్టమైసమ్మకు బోనాలు సమర్పించారు. బతుకమ్మల పూజ చేశారు. సహపంక్తి భోజనాలు చేశారు. జడ్పీ సీఈవో గణపతి, ఇరిగేషన్ డీఈ సుశీల్, తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎంపీడీవో శ్రీనివాస్, ఎస్ఐ రాధిక, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, ఎంపీపీ కుడిమెత రత్నప్రభ, వైస్ ఎంపీపీ గడ్డం లస్మన్న, సర్పంచ్లు , ఉపసర్పంచ్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యదర్శులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 8 : తెలంగాణ దశాబ్డి ఉత్సవాల్లో భాగంగా గురువారం చెరువుల వద్ద ‘మనఊరు-మన చెరువు’ కార్యక్రమంలో భాగంగా చెరువుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ పంద్ర జైవంత్రావ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు, యువతులు బతుకమ్మలు, మహిళలు బోనాలతో ఊరంతా కలిసి చెరువు గట్టుకు చేరుకొని మైసమ్మకు ఘనంగా పూజలు చేశారు. అనంతరం చెరువు గట్టుపైనే సంహపక్తి భోజనాలు నిర్వహించారు. ఏపీవో జనరల్ కనక భీంరావ్, సర్పంచ్ పంద్ర లత, ఉప సర్పంచ్ వెడ్మ పార్వతి, కార్యదర్శి ప్రవీణ్, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
ఉట్నూర్ రూరల్, జూన్ 8 : గ్రామాల్లో చెరువులను కాపాడుకోవాలని సీఐ సైదారావు అన్నారు. మండలంలోని ఎక్స్రోడ్ లింగోజీతండా గ్రామంలో నిర్వహించిన ఊరూరా చెరువుల పండుగ కార్యక్రమంలో ఆయన ముఖ్య అథితిగా పాల్గొన్నారు. గ్రామస్తులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. ప్రభుత్వం చెరువులకు మరమ్మతులు చేసి అభివృద్ధి చేయడంతో ఎంతో మేలు చేకూరిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ హరినాయక్, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 8 : చెరువుల పండుగకు మండల అధికారులు, సర్పంచ్ల ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. మహిళా సర్పంచ్లు బోనాల కుండలతోపాటు బతుకమ్మలను రంగురంగుల పువ్వులతో అలంకరించారు. గ్రామాల్లో భారీ శోభాయాత్రలు నిర్వహించారు. చెరువుల వద్ద ప్రత్యేక వంటకాలు చేసి ప్రజలకు భోజనాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, మండల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రవెల్లి, జూన్ 8 : మండలంలోని ధోడంద గ్రామపంచాయతీ పరిధిలో నిర్వహించిన చెరువుల పండుగ ఉత్సవాల్లో నోడల్ అధికారి, ఆదిలాబాద్ డీటీసీ పప్పుల శ్రీనివాస్ పాల్గొన్నారు. దాదాపు 300 మంది పాల్గొని గ్రామాల్లో భారీ శోభాయాత్ర తీశారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతంలోని రైతుల అభ్యున్నతికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగోరావ్, ఉపసర్పంచ్ భీంరావ్, ఎంపీటీసీ జంగుబాయి, జీపీ కార్యదర్శి సల్మా పర్వీన్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
నార్నూర్,జూన్ 8 : నార్నూర్, గాదిగూడ మండలాల్లోని 48 చెరువుల వద్ద చెరువుల పండుగను ఘనంగా నిర్వహించారు. బతుకమ్మలతో ర్యాలీ తీశారు. చెరువుల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేశారు. సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ప్రత్యేకాధికారులు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.