బోథ్, ఆగస్టు 21 : సీఎం కేసీఆర్ బోథ్ అంసెబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థిగా జాదవ్ అనిల్ను ప్రకటించడంతో సోమవారం పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకున్నారు. సొనాలలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చారు. బోథ్లో అనిల్ అభిమానులు, కార్యకర్తలు పటాకులు కాల్చారు. జై అనిల్ అన్న, జై కేసీఆర్, జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో గ్రామాల నాయకులు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.
నేరడిగొండ, ఆగస్టు 21 : నేరడిగొండలో జాదవ్ అనిల్ నివాసం వద్ద బీఆర్ఎస్ శ్రేణులు నృత్యాలు చేశారు. అనంతరం సర్వీసు రోడ్డుపై పటాకులు కాల్చారు. జై కేసీఆర్..జై కేటీఆర్ అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకున్నారు. అలాగే మండలంలోని వాంకిడి, లింగట్ల, రాజురా తదితర గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో పీఏసీఎస్ మాజీ చైర్మన్ సాబ్లే నానక్సింగ్, వీడీసీ చైర్మన్ రవీందర్రెడ్డి, నాయకులు ప్రతాప్సింగ్, గులాబ్సింగ్, జాదవ్ గణేశ్, సర్పంచ్ జాదవ్ రమేశ్, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
బజార్హత్నూర్, ఆగస్టు 21 : మండల కేంద్రంలోని పాత బస్టాండ్ సమీపంలో బీఆర్ఎస్ నాయకులు, అభిమానులు పటాకులు కాల్చి మిఠాయిలు తినిపించుకున్నారు. జాదవ్ అనిల్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని నాయకులు ధీమా వ్యక్తం చేశారు. కార్యాక్రమంలో నాయకులు మడిగే రమేశ్, తాండ్ర శ్రీనివాస్, నారడి మల్లేశ్, అజయ్, జానార్దన్, సల్మాన్, గంగాధర్ పాల్గొన్నారు.
భీంపూర్,ఆగస్టు 21 : భీంపూర్, పిప్పల్కోటి గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు పటాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. జై కేసీఆర్, జై అనిల్ అంటూ నినాదించారు. కార్యక్రమంలో అనిల్ యువసేన ప్రతినిధి షేక్ అఫ్రోజ్, జడ్పీటీసీ కుమ్ర సుధాకర్, నాయకులు సాయి, జహూర్ అహ్మద్, అనిల్, రమణారెడ్డి , ధరమ్సింగ్, వివిధ గ్రామాల యువజన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఇచ్చోడ, ఆగస్టు 21: సిరికొండ, ఇచ్చోడ మండల కేంద్రాలతో పాటు గ్రామాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి మిఠాయిలు పంచుకొని సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఇచ్చోడ ఎంపీపీ ప్రీతమ్రెడ్డి, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు పాండు, ఇచ్చోడ ఉప సర్పంచ్ శిరీష్, ముక్రా(కే) ఎంపీటీసీ గాడ్గె సుభాష్, బీఆర్ఎస్ నాయకులు బొడ్డు శ్రీను, భాస్కర్, రోహిదాస్ పాల్గొన్నారు.