తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి మూడు రోజులపాటు నిర్వహించనున్న తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అత్యంత అట్టహాసంగా నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గ కేంద్రాల్లో ఏర్పాట్లు చేయగా కలెక్టర్ సిక్తా పట్నాయక్, ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి పరిశీలించారు. నిర్మల్ పట్టణంలో ఏర్పాట్లను కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఎస్పీ ప్రవీణ్కుమార్.. ముథోల్ నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే విఠల్రెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాంబాబు పరిశీలించారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్లలో వేలాది మందితో ర్యాలీ నిర్వహించడానికి సర్వం సిద్ధం చేశారు.
ఎదులాపురం,సెప్టెంబర్ 15: తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ సిక్తా పట్నాయక్ పేర్కొన్నారు. వేడుకల నిర్వహణపై ఆయా శాఖల అధికారులు, సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదిలాబాద్, బో థ్ అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 15 వేల మంది చొప్పున భారీ ర్యాలీ నిర్వహించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఉద యం 9 నుంచి వార్డుల వారీగా ర్యాలీలో ప్రజలను భాగస్వామ్యం చేస్తూ కలెక్టర్ చౌరస్తాకు చేరుకోవాలని, 11 గంటలకు కలెక్టర్ చౌరస్తా నుంచి ఇందిరా ప్రియదర్శిని స్డేడియం వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు, మహిళలు, మీడియ ప్రతినిధులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలన్నా రు. 17న జాతీయ పతాకావిష్కరణ , 18న జిల్లా కేంద్రం లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. అనంతరం ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వజ్రోత్సవాలను పకడ్బందీగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ ద్వారా ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం ఈ నెల 17న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్న కుమ్రం భీం ఆదివాసీ భవన్ , సేవాలాల్ బంజా రా భవన్కు సంబంధించిన పోస్టర్ను అధికారుల తో కలిసి విడుదల చేశారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు రిజ్వాన్ భాషా షేక్, ఎస్. నటరాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ, అదనపు ఎస్పీ శ్రీ నివాస్రావు, జడ్పీ సీఈవో గణపతి, రిమ్స్ డైరెక్టర్ జైసింగ్ రాథోడ్, డీపీఆర్వో ఎన్. భీమ్ కుమా ర్ , పోలీస్ , వివిధ శాఖల అధికారులు ఉన్నారు.
బోథ్ జూనియర్ కళాశాల మైదానం పరిశీలన..
బోథ్, సెప్టెంబర్ 15: మండలకేంద్రంలోని జూనియర్ కళాశాల మైదానాన్ని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఎస్పీ ఉదయ్కుమార్రెడ్డి, అదనపు కలెక్టర్ రిజ్వాన్ షేక్ బాషా, అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు, ట్రైనీ కలెక్టర్ డాక్టర్ శ్రీజతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. నియోజకవర్గం నుంచి సుమారు 15 వేల మంది ర్యాలీకి హాజరయ్యే అవకాశం ఉందని, వారికి వసతులు, భోజన వసతి కల్పించాలన్నా రు. వారి వెంట డీఆర్డీవో ఎస్ కిషన్, ఆదిలాబాద్ ఆర్డీవో రాథోడ్ రమేశ్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీనివాస్, తహసీల్దార్ అతికొద్దీన్, సీఐ ముదావత్ నైలు, ఎంపీవో జీవన్రెడ్డి, ఏపీవో జగ్దేరావు, సర్పంచ్ సురేందర్ యాదవ్ ఉన్నారు.
ఏర్పాట్ల పరిశీలన
ఆదిలాబాద్ రూరల్, సెప్టెంబర్ 15: జిల్లాకేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో వజ్రోత్సవాల ఏర్పాట్లను ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మున్సిపల్ కమిషనర్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలోని వినాయక్ చౌక్ నుంచి ర్యాలీ ప్రారంభించి సు మారు 15 వేల మందితో జాతీయ జెండాలతో పాటు వినాయక్ చౌక్ నుంచి తెలంగాణ చౌక్, కలెక్టర్ చౌక్ల మీదుగా స్టేడియం వరకు ర్యాలీ నిర్వహిస్తామన్నారు. పట్టణంలోని 49 వార్డుల్లో నుంచి ర్యాలీలు బయలుదేరి స్టేడియానికి చేరుకుంటాయన్నారు. అనంతరం అక్కడే సభను ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట అడిషనల్ ఎస్పీలు శ్రీనివాస రావ్, సమైజాన్రావ్, డీఎస్పీ ఉమామహేశ్వర్రావ్ తదితరులు పాల్గొన్నారు.
వేడుకలకు ఏర్పాట్లు పూర్తి
నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 15 : తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ సమైక్యతా వజ్రోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. పట్టణంలోని ఈదిగాం, మంత్రి క్యాంపు కార్యాలయం, గాంధీచౌక్, బస్టాండ్, కలెక్టరేట్, తదితర ప్రాంతాల్లో చేపట్టనున్న ర్యాలీ రూట్మ్యాప్ను ఎస్పీ ప్రవీణ్కుమార్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్మల్ నియోజకవర్గంలోని అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు, మహిళా సంఘాలు పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొనేలా చూడాలన్నారు. ర్యాలీకి వచ్చిన వారికి అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. ఈ నెల 17న నిర్మల్ పట్టణంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుందని, 18న సాం స్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో డీఆర్డీవో విజయలక్ష్మి, డీఎస్పీ జీవన్రెడ్డి, తహసీల్దార్ సుభాష్చందర్, సీఐ శ్రీనివాస్, డీఆర్డీవో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు
ర్యాలీని ఘనంగా నిర్వహించాలి
ముథోల్, సెప్టెంబర్, 15 : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల క్రీడా మైదానంలో ఈ నెల 16న నిర్వహించే సమైక్యతా ర్యాలీని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, అదనపు కలెక్టర్ రాంబాబు పిలుపునిచ్చారు. గురువారం అందుకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి మాట్లాడారు. దాదాపు 15 వేల మంది విద్యార్థులతో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం ఉన్నత పాఠశాలలో సభ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులకు డీలక్స్, బస్వ గార్డెన్ ఫంక్షన్ హాళ్లలో భోజన వసతిని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు హాజరు కా వాలన్నారు. వారి వెంట ఆర్డీవో లోకేశ్వర్ రావు, తహసీల్దార్ శ్యాంసుందర్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షుడు అప్రోజ్ ఖాన్, అధికారులు, నాయకు లు, ప్రజాప్రతినిధులు ఉన్నారు.
వేడుకలకు తరలిరావాలి
ఖానాపూర్ టౌన్, సెప్టెంబర్ 15: వజ్రోత్సవాలకు అధికారులు, సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రే ఖానాయక్, అదనపు కలెక్టర్ హేమాంత్ బోర్కడే పిలుపునిచ్చారు. పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో పలుశాఖల అధికారులతో సమావేశం నిర్వహించి వేడుకల నిర్వహణపై సూ చనలు చేశారు. ఈ సం దర్భంగా వా రు మాట్లాడు తూ నియోజకవర్గం నుంచి 15 వేల మంది హాజరయ్యేలా చూడాలన్నారు. అనంతరం ర్యాలీ, సభ ప్రాంగణాన్ని వ్య వసాయ మా ర్కెట్ యా ర్డులో పరిశీలించారు. వే డుకలకు రా నున్న వారికి భోజ న, తాగునీటి వస తితో పాటు ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూ డాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.
రేపు జాతీయ జెండా ఆవిష్కరణ
హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): భారత్ యూనియన్లో తెలంగాణ కలిసిన రోజైన సెప్టెంబర్ 17న హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్లో సీఎం కేసీఆర్ జాతీయ జెం డాను ఎగురవేయనున్నారు. అలాగే జిల్లాకేంద్రాల్లో మంత్రులు, ప్రజాప్రతినిధులు జాతీ య జెండా ఆవిష్కరించనున్నారు. ఆదిలాబా ద్లో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్, నిర్మల్లో మంత్రి ఇంద్రకరణ్రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయనున్నారు.ప్రభుత్వ కార్యాలయా లు, మున్సిపాలిటీలు, పంచాయతీల్లో అధికా రులు, కమిషనర్లు, చైర్మన్లు, సర్పంచ్లు జాతీ య జెండాను ఆవిష్కరించనున్నారు. ఆది వారం జిల్లా కేంద్రాల్లో సాంస్కృతిక కార్యక్ర మాలు నిర్వహించనున్నారు.