ఎదులాపురం, జూన్ 6 : రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా ఉన్నదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ప్రజలంతా శాంతియుతంగా ఉంటున్నారని, అందుకు పోలీస్ వ్యవస్థలో పెను మార్పులు సంభవించాయని పేర్కొన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో సురక్షా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక హెడ్క్వార్టర్స్ నుం చి సురక్షా ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమానికి ము ఖ్యఅతిథులుగా ఎమ్మెల్యేలు జోగు రామన్న, రాథోడ్ బాపురావు, కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ పీ శ్రీజ హాజరయ్యారు. ముందుగా గాల్లోకి బెలూ న్లు వదిలారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామన్న ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఇందులో జిల్లా పోలీసులకు సంబంధించిన వర్టికల్స్ డయల్ 100, బ్లూకోర్ట్, పెట్రోకార్, క్లూస్ టీమ్, డాగ్స్కాడ్, రిసెప్షన్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, సీసీ టీఎన్ఎస్, సైబర్ క్రైమ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, షీ టీం, కమ్యూనిటీ పోలీసింగ్, ట్రాఫిక్, అనేక అంశాలతో కూడిన శకటాలను పట్టణంలోని అన్ని ప్రధాన కూడళ్ల గుండా తిప్పి ప్రజలకు అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పాటు తర్వాత పోలీసుల్లో పెను మార్పులు సంభవించాయన్నారు. వారికి అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, ప్రజల రక్షణలో ప్రభుత్వం ముందుంటుందని పేర్కొన్నారు. అనేక రకాల నూతన పోలీస్స్టేషన్లు, కమిషనరేట్లు ఏర్పాటు చేసిందన్నారు. రాష్ట్రం ప్రశాంతంగా ఉండేందుకు పోలీసుల కృషి గొప్పదని కొనియాడారు. అనంతరం కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో, జిల్లాలో నేరాల సంఖ్య తగ్గుముఖం పట్టేందుకు పోలీసులు అవలంబిస్తున్న ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానం ముఖ్య కారణమన్నారు. దేశంలోనే తెలంగాణ పోలీసులకు అన్ని రకాల సౌకర్యాలను కల్పించి, ప్రజలకు చేరువచేసేలా ప్రభుత్వం వినూత్న ఆలోచనతో ముందుకు సాగుతున్నదని పేర్కొన్నారు.
రాష్ట్ర పోలీసులకు ప్రభుత్వం నూతన భవనాలను నిర్మించి, నూతన వాహనాలను కేటాయించిందని వివరించారు. ఇతర రాష్ర్టాల పోలీసులతో పోల్చుకుంటే ఇక్కడివారి పనితీరు, గుర్తింపు ప్రత్యేకమైనదని తెలిపారు. ఆ తర్వాత బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు మాట్లాడుతూ.. తెలంగాణ పోలీసులకు దేశంలోనే ప్రత్యేక గుర్తింపు ఉన్నదని కొనియాడారు. జిల్లా ప్రజలకు పోలీసుల ద్వారా అందించే సౌకర్యం తెలియజేయడానికి సురక్ష ర్యాలీ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఈ ర్యాలీలో 100 బైక్లు, 35 బొలెరో, 20 ఇన్నోవా వాహనాలు పాల్గొన్నట్లు తెలిపారు. అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, అదనపు కమాండెంట్ జయరాజ్, డీఎస్పీ వీ ఉమేందర్, సీఐ, ఎస్ఐ, కానిస్టేబుళ్లు సిబ్బంది ఉన్నారు.