ఎదులాపురం, మార్చి 23 : గ్రామీణ పేదరిక నిర్మూలనకు నిరంతరం కృషి చేస్తున్న సెర్ప్ ఉద్యో గులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. జిల్లాలోని సెర్ప్ ఉద్యోగు లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువా రం సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ ఫ్లెక్సీలకు పాలాభిషేకం చేశారు. అనంత రం ఎమ్మెల్యే రామన్నకు పుష్పగుచ్ఛం అందజేసి సన్మానించి స్వీట్లు తినిపించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జోగు రామన్న మాట్లాడుతూ 23 ఏళ్లు గా ఎదురు చూస్తున్న సెర్ప్ ఉద్యోగుల కల నెరవే రిందన్నారు. గౌరవప్రదమైన పే స్కేల్తో రాష్ట్ర వ్యాప్తంగా 3974 మంది లబ్ధి చేరుకుందన్నారు. అలాగే జిల్లాలో 154 మందికి లబ్ది పొందుతు న్నారని గుర్తు చేశారు. జీవో ప్రకారం ఏప్రిల్ నెల నుంచి ఉద్యోగులకు సమానంగా పే స్కేల్ అమలు కానుందని పేర్కొన్నారు. ఏడీ డీఆర్డీవోఅర్క చరణ్దాస్, డీపీఎంలు గంగన్న, హేమల, శేషు రావు, సుధారాణి, జిల్లా అధ్యక్షుడు శుద్దోధన్, ఉపాధ్యక్షుడు సీహెచ్ గంగన్న, సభ్యులు స్వామి, రాజారెడ్డి, చంద్రశేఖర్, ప్రసాద్రాజ్, కిరణ్, గొడాం గంగారాం, సీహెచ్ విఠల్, నారాయణ, మోహన్, శ్రీనివాస్, నాందేవ్, ఎల్టీ వెంకట్ రెడ్డి తదితరులు ఉన్నారు.
జైనథ్, మార్చి 23 : గ్రామాలాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండల కేంద్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీలకు గానూ అవార్డులు అందుకున్న 12 గ్రామ పంచాయతీ సర్పంచ్లు, కార్యదర్శుల కు ప్రశంసాపత్రాలు అందజేసి అభి నందించారు. జైనథ్, కాఫ్రి, బహదుర్పూర్, గిమ్మ, పెండల్ వాడ, సిర్సన్న, నిరాల, మాడగాడ, సాంగ్వి, మెడిగూడ(సీ), కంఠ, సావపూర్ ఉత్తమ గ్రామ పంచాయతీలుగా ఎంపికయ్యాయి. ఎంపీపీ మర్శె ట్టి గోవర్ధన్, వైస్ ఎంపీపీ విజయ్కుమార్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు తుమ్మల వెంకట్రెడ్డి, ఎంపీడీ వో గజనాథ్రావు, ఎంపీవో వెంకటరాజు, స్థానిక సర్పంచ్ దేవన్న, పుండ్రు వెంకటరెడ్డి, సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆదిలాబాద్ టౌన్, మార్చి 23 : గ్రామాల్లో నెలకొన్న సమస్యలను సమస్యలు పరిష్కరించా లని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. దీన్ దయాల్ ఉపాధ్యాయ ఉత్తమ గ్రామపంచాయతీ మండల స్థాయి అవార్డుకు ఎంపికవగా సర్పంచ్లను సత్కరించారు. మావల మండలంలోని మూడు గ్రామాలు అవార్డుకు ఎన్నిక కాగా సర్పంచ్లను సన్మానించారు. సర్పం చ్లు రాగం గంగమ్మ, దొగ్గలి ప్రమీల, మడావి మయూరి, వైస్ ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, ఎంపీడీవో అరుణ, ఎంపీవో లక్ష్మణ్, నాయకులు నల్ల రాజే శ్వర్, రాగం గోవర్ధన్, ముక్కెర మహేందర్, అజీ మ్, సుధీర్, ఉమాకాంత్ రెడ్డి, అశోక్, విజయ్, నారాయణ, విలాస్ రెడ్డి, సృజన్, అభిమాన్, సంతోష్, గంగన్న పాల్గొన్నారు.