బేల, సెప్టెంబర్ 23 : సబ్బండ కులాల సంక్షేమమే బీఆర్ ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బేల మం డలం ఎకోరి, హేటి, భవానీగూడ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు శనివారం భూమిపూజ చేశా రు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఎమ్మెల్యే జోగు రామన్నకు భజన సంకీర్తనలతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జోగు రామ న్న మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలు, వర్గాల ప్రజలకు జీవం పోశారన్నారు. ప్రాధాన్యతను బట్టి ఆయా కులాలను ప్రోత్సహిస్తున్నట్లు చె ప్పారు. తన 35 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇంత గొప్పగా పనిచేస్తున్న సీఎంను చూడలేదన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో ఆదిలాబాద్ నియోజకవర్గాన్ని కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి చేశానని, త్వరలోనే మరింత అభివృద్ధి చేసి యువతకు సహకారం అందించి ప్రోత్సహిస్తామని హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఉత్తమ జీపీ ల్లో తెలంగాణ పల్లెలే ఆధికంగా ఉన్నాయన్నారు. 70 ఏళ్లలో చేయలేని అభివృద్ధి కేవలం 10 ఏళ్లలో చేసి దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నారని గుర్తుచేశారు.
వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ ప్రభుత్వమే గెలిపించి అభివృద్ధికి సహకరించాలని సూచించా రు. అనంతరం హేటి గ్రామంలో రూ.5 లక్షలతో షెడ్, రూ.2 లక్షలతో సీసీ ప్లాట్ ఫాం, ఎకోరి గ్రా మంలో రూ.20 లక్షలతో గ్రామ పంచాయతీ భవ న నిర్మాణానికి భూమి పూజ చేశారు. భవానీగూడ గ్రామంలో రూ.5 లక్షలతో సీసీ ప్లాట్ ఫాం నిర్మా ణానికి భూమి పూజ చేశారు. అంతకుముందు మసాల(బీ) గ్రామస్తులు ఎమ్మెల్యే జోగు రామన్న ను సన్మానించారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రావుత్ మనోహర్, డీసీసీబీ చైర్మన్ ఆడ్డి భోజారెడ్డి, బీఆర్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, బేల, జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ గోడం వర్ష, బీఆర్ నాయకులు కళ్యాం ప్రమోద్ బండి సుదర్శన్, సతీశ్ అరుణ్, బత్తుల సుధాం, రామెల్లి అశోక్, రమేశ్, సునీల్ గోడం, ఖోడే విపిన్, విఠల్ వారాడే, తాన్ భా ఠాక్రే, ఎంపీడీవో మహేంద్ కుమార్, ఐటీడీఏ ఏఈ సుధాకర్, సర్పంచ్ ఎంపీటీసీలు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, నాయకులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.