ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన ఉత్తీర్ణత
సత్తా చాటిన పేదింటి విద్యార్థులు
కస్తూర్బాల్లోనూ 100శాతం రిజల్ట్
సారంగాపూర్లో 98.17 ఉత్తీర్ణత
సారంగాపూర్, జూన్ 30 : మండలంలో 439 మంది పరీక్ష రాయగా 431 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో మధుసూదన్ తెలిపారు. స్వర్ణ, చించోలి(బి), ఆలూర్, కౌట్ల(బి), జామ్, బీరవెల్లి, జామ్ కేజీబీవీ, జామ్ గురుకుల పాఠశాలలు వందశాతం ఉత్తీర్ణత సాధించాయన్నారు. జామ్ గురుకుల విద్యార్థిని భన్సోడే సాక్షి 10జీపీఏతో మండల టాపర్గా నిలిచింది. సాక్షిని ఎంపీటీసీ మహిపాల్ వనజ, ఉసర్పంచ్ కరిపె విలాస్, ప్రిన్సిపాల్ రమాకళ్యాణి, ఉపాధ్యాయులు అభినందించారు.
వందశాతం రిజల్ట్..
సోన్, జూన్ 30 : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో సోన్, జాఫ్రాపూర్, మాదాపూర్, న్యూవెల్మల్, పాక్పట్ల, అనంతపేట్, రత్నాపూర్కాండ్లీ, వెంగ్వాపేట్ పాఠశాలలు నూరు శాతం ఉత్తీర్ణత సాధించాయి. సోన్ కస్తూర్బాగాంధీ విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎస్ఓ లత తెలిపారు.
ఎస్ఆర్ పైమ్ విద్యార్థుల ప్రతిభ…
నిర్మల్ మండలంలోని డ్యాంగాపూర్ గ్రామ సమీపంలో గల ఎస్ఆర్ ప్రైమ్ పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో అత్యధిక గ్రేడింగ్ సాధించినట్లు జోనల్ ఇన్చార్జి దేవీదాస్ తెలిపారు. గ్రేడింగ్ సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రుల సమక్షంలో సన్మానం చేశారు. ప్రిన్సిపాల్ రణరాజ్, సుమలత పాల్గొన్నారు.
సత్తా చాటిన శాంతినికేతన్
నిర్మల్ అర్బన్, జూన్ 30 : పట్టణంలోని శాంతినికేతన్ ఇంగ్లిష్ మీడియం పాఠశాల విద్యార్థులు పదో పరీక్ష పలితాల్లో 100 శాతం ఉత్తీర్ణతను సాధించినట్లు పాఠశాల డైరెక్టర్ భగవతి పద్మనాభ గౌడ్ తెలిపారు. మొత్తం 125 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 12 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్లు వెల్లడించారు.
వాసవి ప్రభంజనం
నిర్మల్ అర్బన్, జూన్ 8 : నిర్మల్ పట్టణంలోని వాసవి పాఠశాల విద్యార్థులు ప్రభంజనం సృష్టించారని కరస్పాండెంట్ పోతారెడ్డి తెలిపారు. 252 మంది విద్యార్థుల్లో 53మంది 10 జీపీఏ, 238 మంది విద్యార్థులు 9.0 జీపీఏ పైగా సాధించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సెక్రటరీ జగదీశ్రెడ్డి, మోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ రాజ్కుమార్, శ్రీనివాస్శెట్టి పాల్గొన్నారు.
తానూర్ టాపర్గా కృష్ణవేణి
తానూర్, జూన్ 30 : పదోతరగతి పరీక్ష ఫలితాల్లో బోర్గాం పాఠశాలకు చెందిన విద్యార్థిని కృష్ణవేణి 9.8 మార్కులు సాధించి మండల టాపర్గా నిలిచింది. మొత్తం 347 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 331 మంది (95శాతం) ఉత్తీర్ణులైనట్లు విద్యాధికారి సుభాష్ తెలిపారు.
కుంటాలలో 98 శాతం ఉత్తీర్ణత
కుంటాల, జూన్ 30 : పదో తరగతి ఫలితాల్లో మండల విద్యార్థులు 98 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ఎంఈవో వాటోలి ముత్యం తెలిపారు.
కుభీర్లో 99శాతం
కుభీర్, జూన్ 30 : కుభీర్, నిగ్వ, మాలేగాంవ్, పల్సి, పార్డి(బీ), ఏహెచ్ఎస్ డోడర్న, కేజీబీవీ(కుభీర్) ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నుంచి 286 మంది పరీక్షలు రాయగా 281 మంది ఉత్తీర్ణులైనట్లు ఎంఈవో చంద్రకాంత్ తెలిపారు.
భైంసాలో..
భైంసా, జూన్ 30 : వేదం, అల్పోర్స్, గౌతమి మోడల్ పాఠశాలలో పదుల సంఖ్యలో విద్యార్థులు 10జీపీఏ సాధించారు. మైనార్టీ గురుకుల పాఠశాలలో ముదస్సిర్, రాకేశ్, సాగర్ 9.8గ్రేడ్ సాధించారు.
పెంబి మండలంలో..
పరంబి, జూన్ 30: పెంబి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నూరుశాతం ఉత్తీర్ణత నమోదైంది.
పరంబిలో..
పరంబి, జూన్ 30 : పెంబి మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత నమోదైంది.
కడెం మండలంలో..
కడెం, జూన్ 30: మండల కేంద్రంలోని జడ్పీ పాఠశాలలో మొత్తం 102 మంది విద్యార్థులకు గాను 98 మంది ఉత్తీర్ణులైనట్లు ప్రధానోపాధ్యాయురాలు విజయస్వప్న తెలిపారు. మండలంలోని లింగాపూర్ జడ్పీ పాఠశాలలో 116/114 మంది ఉత్తీర్ణత సాధించినట్లు హెచ్ఎం వామన్రావు తెలిపారు. అంబారిపేట జడ్పీ పాఠశాలలో వందశాతం రిజల్ట్ వచ్చినట్లు హెచ్ఎం జీ ప్రేమ్దాస్ తెలిపారు. నచ్చన్ఎల్లాపూర్కు చెందిన గురుకుల బాలికల పాఠశాలలో 75 మంది విద్యార్థులకు గాను 75 మంది ఉత్తీర్ణత సాధించినట్లు ప్రిన్సిపాల్ సత్యనారాయణరెడ్డి తెలిపారు. జీయర్ గురుకులంలో 26 మందికి 26 మంది పాసైనట్లు జెట్స్ అధ్యక్షుడు ఎస్.ప్రభాకర్రావు, హెచ్ఎం ఎస్ చంద్రశేఖర్, శ్రీమాన్ శాంతరాంస్వామిజీ తెలిపారు.
ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల ప్రతిభ
దస్తురాబాద్, జూన్ 30 : పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మండలంలో 99.42 శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఎంఈవో మధుసూదన్ తెలిపారు. మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ, ఆశ్రమ పాఠశాల (బాలికల),మల్లాపూర్ ఆశ్రమ (బాలుర)పాఠశాల 100 శాతం ఉత్తీర్ణత సాధించాయని వెల్లడించారు. రేవోజిపేట గ్రామానికి చెందిన కేజీబీవీ విద్యార్థిని కర్నె సృజన 9.7 జీపీఏ గ్రేడ్తో మండల టాపర్గా నిలిచినట్లు తెలిపారు.
కస్తూర్బా విద్యార్థినుల ప్రతిభ
లక్ష్మణచాంద, జూన్ 30 : కస్తూర్బా పాఠశాలలో 37/37 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఎం. అక్షిత 10 జీపీఏ, పి.ప్రగతి కుమారి 9.8 జీపీఏ పాయింట్లు సాధించారు. ప్రైవేటు పాఠశాలకు దీటుగా ప్రతిభ చాటడం పట్ల పాఠశాల ప్రత్యేకాధికారి నవిత, ఉపాధ్యాయులు, గ్రామస్తులు అభినందించారు.
హాస్టల్ విద్యార్థులు భేష్
నిర్మల్ టౌన్, జూన్ 30 : బీసీ, ఎస్సీ సంక్షేమ హాస్టళ్లలో 98శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు ఆ శాఖ అధికారి రాజేశ్వర్గౌడ్ తెలిపారు. బీసీ విద్యార్థుల్లో 193 మంది విద్యార్థులకుగాను 189 మంది, ఎస్సీ హాస్టల్లో 195 విద్యార్థులకుగాను 180 మంది ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.