సారంగాపూర్, ఫిబ్రవరి 3 : సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెం దుతున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. మండలంలోని చించోలి(బీ) నేషనల్ హైవే సమీపంలో 3 ఎకరాల విస్తీర్ణంలో రూ. 3.50 కోట్లతో రవాణాశాఖ భవన నిర్మాణానికి గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జూన్ 2న ఆవిర్భావ దినోత్సవం నాటికి కొత్త భవనం ప్రారంభోత్సవం చేసుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, మంత్రి సోదరుడు అల్లోల మురళీధర్రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా కో-ఆర్డినేటర్ నల్లావెంకట్రాంరెడ్డి, ఎంపీపీ అట్ల మహిపాల్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ వంగరవీందర్రెడ్డి, అడెల్లి పోచమ్మ ఆలయ కమిటీ చైర్మన్ అయిటి చందు, టీఆర్ఎస్ మండల కన్వీనర్ మాధవరావు, నారాయణరెడ్డి, ఆలూర్ సొసైటీ చైర్మన్ మాణిక్రెడ్డి, సర్పంచ్ చాట్ల లక్ష్మి, ఎంపీటీసీ వెంకటరమణారెడ్డి, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శ్రీనివాస్, ఆర్డీవో రమేశ్ రాథోడ్, ఆర్అండ్ ఈఈ అశోక్, ఎంపీడీవో పాల్గొన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు ధనంజయ్రెడ్డి, రాజేశ్వర్ బుధవారం అనారోగ్యంతో మృతి చెందగా బాధిత కుటుంబాలను పరామర్శించారు.
ఖానాపూర్ ప్రాంతం శ్రీ సాయిబాబా నామస్మరణతో పులకరించింది. శ్రీసాయిబాబా 25వ వార్షికోత్సవాన్ని ఆలయ కమిటీ వైభవంగా నిర్వహించింది. ప్రధాన అర్చకులు శ్రీరామోజుల రామకృష్ణ శర్మ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. శివపార్వతుల కల్యాణం కన్నుల పండువగా జరిపారు. మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, ఎమ్మెల్యే రేఖానాయక్, టీజీవో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు శ్యాంనాయక్, మున్సిపల్ చైర్మన్ అంకం రాజేం దర్, ఖానాపూర్ సీఐ అజయ్బాబు, ఎస్సై రజి నీకాంత్తో పాటు పలువురు అధికారులు, నాయ కులు బాబాను దర్శించుకొని పూజలు చేశారు. మంత్రి, ఎమ్మెల్యేను ఆలయ కమిటీ సభ్యులు సన్మానించి, ప్రసాదాలు అందజేశారు. కార్యక్ర మం లో ఆలయ కమిటీ అధ్యక్షుడు బక్కశెట్టి కిశోర్, ఉపాధ్యక్షుడు ద్యావతి రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.