ఉట్నూర్ రూరల్, నవంబర్ 9: ఐకేపీ కొనుగోలు కేంద్రాల ఏర్పాటుతో రైతులకు లబ్ధి చేకూరుతుందని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. బీర్సా యిపేట్, గంగన్నపేట్లో ఐకేపీ మహిళా సంఘం ఆధ్వర్యంలో, మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఎమ్మెల్యే రేఖానాయక్ మంగళవారం ప్రా రంభించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. రైతులు దళారుల చేతిలో మోసపోకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నదని, మద్దతు ధర కల్పిస్తున్నదని తెలిపారు.
వరి వేసి నష్టపోవద్దు
ప్రతి పక్షాల మాటలు విని యాసంగిలో వరి పంట వేసి రైతులు నష్టపోవద్దని ఎమ్మెల్యే కోరారు. కేంద్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు చేయదన్నారు. ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి పెట్టాలని రైతులకు సూచించారు. రైతులు నష్టపోవద్దనే సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ చారులత రాథోడ్, ఎంపీపీ పంద్ర జైవంత్రావు, సర్పంచ్లు కళావతి, హరినాయక్, డీఎస్వో సుదర్శన్, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, వైస్ చైర్మన్ నారాయణ, వైస్ ఎంపీపీ దావులే బాలాజీ, కోఆప్షన్ సభ్యుడు రషీద్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు అజీమొద్దీన్, ఉప సర్పంచ్ కోల సత్తన్న, టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు ధరణి రాజేశ్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు రమేశ్, మాజీ అధ్యక్షుడు సింగారే భారత్, పట్టణ అధ్యక్షుడు సాడిగే రాజ్కుమార్, నాయకులు కామెరి పోశన్న, మునీర్, సతీశ్, కాటం రమేశ్, స్వామి, మేరాజ్, రవి, భూమన్న, నికేశ్, ఐకేపీ సిబ్బంది, నాయకులు, మహి ళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.
తాగునీరు అందించకుంటే చర్యలు
మిషన్ భగీరథ పథకంపై అధికారులు నిర్లక్ష్యం చూపితే చర్యలు తప్పవని, ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో సమావేశ మందిరంలో ఎంపీపీ పంద్ర జైవంత్రావు ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన సర్వసభ్య సమావేశంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఆయా శాఖల వారీగా నిర్వహించారు. మిషన్ భగీరథ నీరు రావడం లేదని సర్పంచ్లు, ఎంపీటీసీలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు రా గా, ఆమె సంబంధిత అధికారులపై ఆగ్ర హం వ్యక్తం చేశారు. ఇప్పటి నుంచి నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తితే కమిషనర్ దృష్టికి తీసుకెళ్లి అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అనంతరం ట్రాన్స్కో, ఈజీఎస్, వ్యవసాయ రం గాల ద్వారా రైతులకు అందిస్తున్న పథకాలు, లబ్ధి పొందిన రైతుల వివరాలు వెల్లడించారు. సమావేశంలో జడ్పీటీసీ చారులత, ఎంపీడీవో తిరుమల, పీఏసీఎస్ చైర్మన్ ఎస్పీరెడ్డి, వైస్ ఎంపీపీ బాలాజీ, మండలంలోని వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు.