పెద్ద సంఖ్యలో తరలివచ్చిన గిరిజనులు
ఇంద్రవెల్లి, అక్టోబర్12: మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో ఉమ్మడి జిల్లా ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆదివాసీ గిరిజనులు మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఏజెన్సీ ప్రాంతంలోని నార్నూర్ మండలానికి చెందిన ఆదివాసీ గిరిజనులు కుటుంబ సమేతంగా ఇంద్రాదేవి ఆలయానికి తరలివచ్చారు. ఇంద్రాదేవికి పూజలు చేసి నైవేద్యాలు సమర్పించారు. ఆదివాసీ గిరిజనులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం భక్తులతో కిటకిటలాడింది. కుటుంబ సమేతంగా సహపంక్తి భోజనాలు చేశారు.