మంచిర్యాల జిల్లాలో జలసవ్వడులు వినిపిస్తున్నాయి. వర్షాలు సమృద్ధిగా కురవడం, ఎగువ ప్రాంతాల నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టులన్నీ నీటితో తొణికిసలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 890 చెరువులు ఉండగా, 90 శాతం వరకు పూర్తిగా నిండాయి. దీంతో పాటు భూగర్భ జలాలు అంతకంతకూ పెరగడంతో ఎక్కడ చూసినా పుష్కలంగా నీళ్లు కనిపిస్తున్నాయి. జలవనరులను చూసిన రైతుల్లో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి. ఇక రెండు పంటలకూ ఢోకా ఉండదని, తాగునీటికీ తిప్పలు తప్పుతాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మంచిర్యాల, సెప్టెంబర్ 21 (నమస్తే తెలంగాణ ): మంచిర్యాల జిల్లాలో నీటి వనరులన్నీ జలకళ సంతరిం చుకున్నాయి. ఇటు సాగుకు, అటు తాగునీటికి ఇబ్బంది లేకుండా పూర్తిస్థాయిలో నీరు నిల్వ ఉండడంతో రైతాం గంతో పాటు ప్రజల్లో సంతోషం వెల్లివిరుస్తున్నది. జిల్లాలోని ఎల్లంపల్లి, గొల్లవాగు, ర్యాలీ, నీల్వాయి ప్రాజె క్టులతో పాటు గూడెం ఎత్తిపోతల పథకాలున్నాయి. అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లతో పాటు 890 చెరువులు ఉన్నాయి. జిల్లా పరిధిలో మూడు నియోజకవర్గాలు న్నాయి. మంచిర్యాల నియోజకవర్గంలో మంచిర్యాల, నస్పూర్, హాజీపూర్, లక్షెట్టిపేట, దండేపల్లి మండలా లున్నాయి. చెన్నూర్ నియోజకవర్గంలో చెన్నూర్, భీమా రం, జైపూర్, మందమర్రి, కోటపల్లి మండలాలు, కాగా, బెల్లంపల్లి నియోజకవర్గంలో బెల్లంపల్లి, కాసిపేట, తాం డూర్, నెన్నెల, భీమిని, కన్నెపల్లి, వేమనపల్లి, ఖానాపూర్ నియోజకవర్గంలో జన్నారం మండలాలు ఉన్నాయి. వీటి పరిధిలో మొత్తం 890 చిన్న నీటి చెరువులు ఉన్నాయి. వీటి కింద 63,496 ఎకరాల ఆయకట్టు ఉంది. వీటిలో 123 చిన్ననీటి వనరులు కాగా, 767 పీఆర్ కుంటలు కలుపుకొని మొత్తం 890 చెరువులు ఉన్నాయి.
రైతుల్లో సంతోషం..
మిషన్ కాకతీయ కింద ప్రభుత్వం పనులు చేపట్టడంతో పాటు పునరుద్ధ రించడంతో చెరువులు, కుంటలు జలశోభితం సంతరించుకున్నాయి. సాగు విస్తీర్ణం పెరిగింది. రైతులు వరి మాత్రమే కాకుండా, కూరగాయలు, ఇతర పంటలను కూడా సాగు చేస్తున్నా రు. గతంలో ఒక పంటకే పరిమితమైన రైతులు నేడు రెండు పంటలూ వేస్తున్నారు. ప్రస్తుతం సాగు, తాగు నీటికి ఢోకా ఉండకుండా తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నది. గతంలో నీటి కష్టాలతో ఒక పంటకే పరిమితమైన జిల్లా రైతులు నేడు రెండు పంటలూ వేసుకుంటూ ఆనందంగా ఉన్నారు. నీల్వాయి ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా నీల్వాయి నుంచి క్యాతన్పల్లి ద్వారా ముల్కల్లపేట వరకు నీరు వెళ్తున్నది. ఎడమ కాలువ ద్వారా గొర్లపల్లి వరకు నీరు వెళ్తుండగా, ఆయా ప్రాంతాల్లోని రైతులకు నీటి కరువు తీరింది. నీటి వనరుల లభ్యతతో రెండు పంటలూ వేసుకుంటున్నారు. వానకాలం, యాసంగి పంటలకు పుష్కలంగా నీరందుతుండడంతో అన్నదాతలు ఆనందపడుతున్నారు. గతేడాదితో పోలిస్తే జిల్లాలో సాగు విస్తీర్ణం కూడా పెరిగింది.
ర్యాలీవాగు
నీటి మట్టం (ఎఫ్ఆర్ఎల్) : 151.500 మీటర్లు
ప్రస్తుతం : 151.450 మీటర్లు
నీటి సామర్థ్యం : 408.588 ఎంసీఎఫ్టీ
ప్రస్తుతం : 403.588 ఎంసీఎఫ్టీ
ఇన్ఫ్లో : 30.00 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : కుడి 10, ఎడమ కాలువ 5 క్యూసెక్కులు
గొల్లవాగు
నీటి మట్టం : 155.50 మీటర్లు, ప్రస్తుతం : 154.65 మీటర్లు
మొత్తం సామర్థ్యం : 0.5675 టీఎంసీలు
ప్రస్తుత సామర్థ్యం : 0.4565 టీఎంసీలు
ఇన్ఫ్లో : 71.50 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో : 0 క్యూసెక్కులు
ఆయకట్టు : 9,500 ఎకరాలు
ఎల్లంపల్లి
నీటి మట్టం : 20.175 టీఎంసీలు
ప్రస్తుతం :19.7864 టీఎంసీలు
ఇన్ఫ్లో : 33,235 క్యూసెక్కులు
అవుట్ ఫ్లో : 33,235 క్యూసెక్కులు
తెరిచివున్న గేట్లు : 6
ఆయకట్టు : 4వేల ఎకరాలు
నీల్వాయి
నీటి మట్టం (ఎఫ్ఆర్ఎల్) : 124 మీటర్లు, ప్రస్తుతం : 124 మీటర్లు
మొత్తం సామర్థ్యం : 846 ఎంసీఎఫ్టీ (మిలియన్ క్యూబిక్ ఫీట్లు)
ప్రస్తుతం : 0.846 టీఎంసీలు ఇన్ఫ్లో : 0 అవుట్ ఫ్లో : 0
ఆయకట్టు : 13 వేల ఎకరాలు