కేంద్రం విధిస్తున్న జీఎస్టీ పేద, మధ్య తరగతి కుటుంబాల నడ్డివిరుస్తున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, బెల్లం, చక్కెర, తేనె, బియ్యం, నూనెలు, గోధుమలు, ఓట్స్, కొబ్బరి నీళ్లు, కూరగాయలు, ఇలా కాదేదీ జీఎస్టీకి అనర్హం అన్నట్లుగా వ్యవహరిస్తుండడం ఆందోళన కలిగిస్తున్నది. 2017 జూలై 1 నుంచి ఈ చట్టం అమల్లోకి రాగా, ఈ ఐదేళ్లలో ధరలు మూడింతలు పెరగడం కలవర పెడుతున్నది. ‘అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయామని, పన్నుల పేరుతో దర్జాగా దోచుకోవడం దారుణమని, ఇలాగైతే బతుకుడెట్లా’ అంటూ మహిళా లోకం మండిపడుతున్నది. కార్పొరేట్లపై కరుణచూపుతూ.. తమపై పెనుభారం మోపుతున్న బీజేపీ సర్కారుకు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నది.
కుమ్రం భీం ఆసిఫాబాద్/మంచిర్యాల, జూలై 21 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలోని మోదీ సర్కారు పాలన తీరు ‘ఏం కొనేటట్లు లేదు.. ఏం తినేటట్లు లేదు..’ అన్నట్లుంది. ఒకే పన్ను పేరుతో కేంద్ర, రాష్ర్టాల పన్నులను ఏకం చేసి ప్రతిష్టాత్మకంగా తెచ్చిన వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) సామాన్యుల ఉసురు తీస్తున్నది. నిత్యావసర వస్తువులను కూడా వదలకుండా పన్నుపోటుతో బాధుతుండడంతో సామాన్య, మధ్య తరగతి జనం కుదేలవుతున్నది. పాలు, పాల ఉత్పత్తులు, పప్పులతో సహా కోట్ల మంది ఆహారమైన నిత్యావసరాలన్నింటిపైనా మోదీ సర్కారు ఎడాపెడా పన్నులు వసూలు చేస్తూనే ఉన్నది. సామాన్యుడి నడ్డి విరుస్తున్నది. కార్పొరేట్లపై మాత్రం ఎక్కడా లేని కరుణ చూపుతున్నది. ఈ నేపథ్యంలో మహిళాలోకం మండిపడుతున్నది. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపో యామని, పన్నుల పేరుతో ధర్జాగా దోచుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. ఈ ఐదేళ్లలో నెలా వారీ ఇంటి ఖర్చులు మూడిండింతలు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు నెలకొన్నాయి. వెంటనే నిత్యావసరా లపై జీఎస్టీని ఎత్తివేయాలని, లేదంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నది.
పడ్డట్లుగా ఉంది. ప్రస్తుతం 99 శాతం సేవలు, వస్తు ఉత్పత్తులపై జీఎస్టీ పడుతుండగా, ఇందులో నిత్యావసరాలే ఎక్కు వగా ఉండడం కలవరపెడుతున్నది. జాతి ప్రయోజనాల కోసమే జీఎస్టీని తెచ్చామని గొప్పలు చెప్పుకుంటూ పేదల నడ్డి విరుస్తున్నది. కార్పొరేట్లకు దోచిపెడుతున్నది. పాలు, పెరుగు, మజ్జిగ, బెల్లం, పంచదార, సహజ తేనె, బియ్యం, గోధుమలు, ఓట్స్, కొబ్బరి నీళ్లు, కూరగాయలు, బియ్యం పిండిపైనా జీఎస్టీని మోదడంతో మహిళలు మండిపడుతున్నారు. ఇప్పటికే వంట గ్యాస్ ధరను పెంచడంతోనే ఆర్థికంగా భారమవుతున్నదని, నిత్యావసరాలపైనా పన్ను విధిస్తే రెక్కాడితే గానీ డొక్కాడని తమ పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
కాదేదీ జీఎస్టీకి అనర్హం..
కాదేదీ జీఎస్టీకి అనర్హం అన్నట్లు మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నది. అసలే కరోనా దెబ్బకు కుదేలైన సామాన్యుడిపై జీఎస్టీ పన్ను మూలిగే నక్కపై తాటి పండు
పేదోళ్లను బత్కనిచ్చేటట్లు లేరు
మాది నిరుపేద కుటుంబం. పొద్దంతా కైకిలికి పోతే రూ. 400 దాకా ఇస్తరు. వారంలో నాలుగు.. లేక ఐదు రోజులు మాత్రమే పని దొరుకుతది. ఒక్కోసారి పది రోజుల దాకా కూడా పని ఉండదు. గీ డబ్బులతో కుటుంబం గడవడం మస్తు కష్టం. సిలిండర్ వాడుడే బంద్ చేసినం. పాల ప్యాకెట్ కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. చాయ్ కూడా తాగుతలేము. నూనె ప్యాకెట్కు రూ. 200 తీసుకుంటున్నరు. ఏది కొందామన్న అగ్గోలే మండుతున్నది. సర్కారొళ్లు ఇచ్చే రేషన్ బియ్యం ఇంత ఆసరైతంది. గీ పెరిగిన ధరలతో బతుకుడు తిప్పలైతంది. ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచి మాలాంటి పేదోళ్లను గోస పెట్టుకుంటున్నరు. మమ్ముల బతుకనిచ్చేటట్లు లేరు.
– సొలంకే సుకుమారి, గృహిణి (ఝరి, కెరమెరి మండలం)
సామాన్యుల జీవితాలతో ఆటలు
మంచిర్యాల అర్బన్, జూలై 21 : కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీని పెంచి సామాన్యుల నడ్డి విరుస్తోంది. పుట్టిన బిడ్డ మొదలుకొని.. శ్మశానవాటికకు వెళ్లే వరకూ పన్నులు విధిస్తోంది. పెంచిన డీజిల్, పెట్రోలు ధరల ప్రభావం రైతాంగం, మధ్య తరగతి ప్రజలపై పడుతోంది. ముఖ్యంగా వ్యవసాయ రంగంపై అధిక ప్రభావం చూపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తుంటే కేంద్రం మాత్రం పన్నుల పేరుతో పేదలను దోపిడీ చేస్తుంది. కార్పొరేటు శక్తులు వేల కోట్లు ఎగవేస్తుంటే వారిని ఏమీ అనదు. ఇప్పటికైనా ఈ విధానాలను మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
– మాలతి, గృహిణి, శ్రీరాంపూర్
పిల్లలు తినే వాటిమీదా కక్కుర్తి పడవట్టే..
బీజేపీ సర్కారోళ్లు మాలాంటి పేదోళ్లను అరిగోస పెట్టుకుంటున్నరు. ఇష్టమొచ్చినట్లు ధరలు పెంచుకుంట పోతున్నరు. ఇది వరకు గ్యాస్ ధర రూ. 465 ఉండేటిది. ఇప్పుడు రూ. 1120 చేసిన్రు. ఇటు పప్పులు, నూనెలు ఇట్లా ఏది కొందామన్నా ధైర్యమొస్తలేదు. గీ చిన్న పిల్లలు తినే చిరు తిండ్ల మీద కూడా కక్కుర్తి పడవట్టే. పాపం వాళ్లకు ఏదైనా కొనిద్దామన్నా పైసలు లేకుంటైతన్నయ్. ఇది వరకు రూ. 10 వేలు సంపాదిస్తే ఇల్లు గడిచేది. ఇప్పుడు రూ. 20 వేలు అయినా సరిపోయేటట్లు లేవు. మాకు కైకిలి దొరుకుడే కష్టం.. ఇగ ఎట్ల బతుకుతం.
– ఎల్ముల గౌరు బాయి, గంగాయిగూడ కాలనీ, సిర్పూర్-టీ