ఇంద్రవెల్లి, జనవరి 27 : జన్నారం మండలంలోని గోదావరి హస్తలమడుగు నుంచి జనవరి 18న సేకరించిన పవిత్ర గంగాజలంతో కెస్లాపూర్కు బయలుదేరిన మెస్రం వంశీయులు సా యంత్రం మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. వీరికి ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గంగాజలంతో ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని, సం ప్రదాయ ప్రత్యేక పూజలు చేశారు. కుటుంబ స మేతంగా ఇంద్రాదేవి ఆలయ ఆవరణలో సా యంత్రం వరకు బస చేశారు. అనంతరం సహపంక్తి భోజనాలు చేసి సాయంత్రం సమయంలో ఇంద్రాదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి అక్క డి నుంచి సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ గంగాజలంతో కాలినడకన, మరికొందరు కు టుంబ సమేతంగా ఎడ్లబండ్లతో కెస్లాపూర్కు బ యల్దేరారు. రాత్రి కెస్లాపూర్ మర్రిచెట్లకు చేరుకు న్న మెస్రం వంశీయులు అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. కాగా.. మెస్రం వంశీయులు మర్రిచెట్లకు చేరుకున్నట్లు కోత్వాల్ తిరుపతి మెస్రం పటేళ్లకు సమాచారం అందించారు. ఝరిని మర్రిచెట్ల ప్రాంతంలోని మోదుగ చెట్టుపై తెల్లని వస్త్రంతో కట్టి భద్రపరిచారు. ప్రత్యేక గుడారాలు ఏర్పాటు చేసుకొని కుటంబ సమేతంగా బసచేశారు. శుక్రవారం రాత్రి మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్తోపాటు మెస్రం వంశీయ పటేళ్లు మర్రిచెట్లకు చేరుకొని 31న నాగోబాకు నిర్వహించే మహపూజలతోపాటు తూమ్ (పిండప్రదానం) పూజల నిర్వహణపై చర్చించించనున్నట్లు మెస్రం వంశీయుల పెద్దలు తెలిపారు. 31న మర్రిచెట్ల నుంచి గోవాడ్కు చేరుకుంటా రు. కటోడ మెస్రం కోసురావ్, పర్ధాంజీ మెస్రం దాదారావ్, కోసుకటోడ, కటోడ మెస్రం హనుమంత్రావ్, మెస్రం వంశీయులు గణపతి, నా గోరావ్, తిరుపతి, మారుతి, ధర్ము పాల్గొన్నారు.
జాతరలో దుకాణాలకు వేలం..
నాగోబా జాతరలో ఏర్పాటు చేసే వివిధ రకాల దుకాణాలకు దేవాదాయ, రెవెన్యూశాఖల ఆధ్వర్యంలో వేలం నిర్వహించారు. నాగోబా దర్బార్హాల్ వద్ద కెస్లాపూర్ సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్ అధ్యక్షతన అధికారులు వేలాన్ని ప్రారంభించారు. తైబజార్ను రూ.7.80 లక్షలకు ధనుంజయ్ దక్కించుకున్నాడు. వాహనాల పార్కింగ్ను ముస్తఫా రూ.80వేలు, విద్యుత్ను బాబాఖాన్ రూ.26వేలు, మురుమురాలను నరేశ్ రూ.30వేలకు దక్కించుకున్నారు. కాగా.. వేలం ద్వారా రూ.9లక్షల 16వేలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. తహసీల్దార్ రాఘవేంద్రరావ్, సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, దేవాదాయ శాఖ అధికారులు రాజమౌళి, సతీశ్, మెస్రం వంశీయులు వెంకట్రావ్పటేల్, ఆనంద్రావ్, నాగ్నాథ్, తుకారాం, ఆలయ పూజారి మెస్రం షేకు, వ్యాపారస్తులు పాల్గొన్నారు.
కొనసాగుతున్న ఏర్పాట్లు
జాతరలో ఆర్డబ్ల్యూఎస్తోపాటు గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేపడుతున్నారు. పనులను ఐటీడీఏ ఏవో రాంబాబుతోపాటు ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులు పరిశీలించారు. ఇప్పటి వరకు 50 తాత్కాలిక స్నానపు గదులు, 30 తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. వాటర్ ట్యాంకులకు రంగులు వేసి విద్యుత్ మోటర్లకు మరమ్మతులు చేశారు. జీపీ ఆధ్వర్యంలో రూ.2.50 లక్షలతో విద్యుత్ దీపాలు ఏర్పాటు చేశారు. చెత్తకోసం రూ.65 వేలతో 50 ప్లాస్టిక్ డ్రమ్ములు, రూ.30వేలతో జాతరలోని అన్ని పరిసరాలను చదును చేశారు. రూ.10 వేలతో సున్నపు బస్తాలు కొనుగోలు చే శారు. ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఏఈ భానుకుమార్, గ్రామపంచాయతీ అధికారులు పాల్గొన్నారు.