ఎదులాపురం,.జనవరి 25 : జిల్లాలో టీబీ కేసులను గుర్తించడానికి ప్రభుత్వం ఏసీఎఫ్ (యాక్టివ్ కేస్ ఫైండింగ్) వాహనంతో జిల్లా వ్యాప్తంగా 50 కేసులను గుర్తించామని ఆదిలాబాద్ డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు. ఆరు రోజుల నుంచి జిల్లా వ్యాప్తంగా ఏసీఎఫ్ వాహనం తిరుగుతూ లక్షణాలున్న వారికి తెమడ పరీక్ష, ఛాతి ఎక్స్రేలు తీసి అప్పటికప్పుడు నిర్ధారణ చేస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని చిల్కూరి లక్ష్మీనగర్ యూపీహెచ్సీ ఆధ్వర్యంలో మహాలక్ష్మీవాడలో వాహ నం ద్వారా పరీక్షలు చేశారు. రెండు వారాలు గా దగ్గు, ఆకలి వేయకపోవడం, బరువు తగ్గ డం వంటి లక్షణాలున్న వారు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. టీబీ నిర్ధారణ అయిన వెంటనే ప్రభుత్వం ఉచితంగా మాత్రలు ఇస్తుందని, ప్రతి నెలా రూ.600 అ కౌంట్లలో జమచేస్తుందని పేర్కొన్నారు. కేసులను గుర్తించినందుకు వైద్యసిబ్బందిని అభినందించారు. టీబీ నియంత్రణ అధికారి ఈ శ్వర్రాజ్, టీబీ కార్యాలయ సిబ్బంది బండా రి కృష్ణ, నవీద్, నాగభూషణం పాల్గొన్నారు.