భీంపూర్, జనవరి 25 : గ్రామాలు, పట్టణాలకు అవసరమైన అభివృద్ధి పనులు, ప్రతి వర్గానికి అవసరమైన పథకాల అమలుతో రాష్ట్రం ప్రగతి పయనం చేస్తున్నదని, సీఎం కేసీఆర్తో నే ఇదంతా సాధ్యమని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పేర్కొన్నారు. తాంసి మండల పరిషత్ కార్యాలయంలో జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, అధికారులతో కలిసి తొమ్మిది మంది లబ్ధిదారులకు మంగళవారం షాదీ ముబారక్ చెక్కులను అందజేశారు. అనంతరం పొన్నారి లో సీసీ రోడ్లు, సైడ్ డ్రెనేజీల పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ.. కల్యాణలక్ష్మి, షాదీముబారక్తో ఇప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా అయ్యిందన్నారు. సర్కారు బడుల్లో ఆంగ్ల మాధ్యమం అమలుతో సీఎం కేసీఆర్ రాష్ట్రంలో లక్షలాది కుటుంబాలకు మేలు చేసినవారయ్యారన్నారు. ఎంపీడీవో ఆకుల భూమ య్య, తహసీల్దార్ సంధ్యారాణి, సర్పంచులు స్వప్న, వెంకన్న, నర్సింగ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, టీఆర్ఎస్ మం డల కన్వీనర్ అరుణ్ కుమార్, నాయకులు సు రుకుంటి శ్రీధర్రెడ్డి, రత్నప్రకాశ్, సామ నాగారెడ్డి ఉన్నారు. అనంతరం తాంసిలో పలువురిని పరామర్శించారు. విశ్రాంత వీఆర్వో శివ్వయ్య తల్లి, రైతు సామ ఆశారెడ్డి తల్లి ఇటీవల వయోభారంతో మృతి చెందారు. ఆ కుటుంబాలను ఎమ్మెల్యే పరామర్శించి, ఓదార్చారు. ఆయన వెంట జడ్పీటీసీ తాటిపెల్లి రాజు, నాయకులు కృష్ణ, గంగారాం ఉన్నారు.