తలమడుగు, జూలై 20 : రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఎంపీడీవో రమాకాంత్ పిలుపునిచ్చారు. మండలంలోని రుయ్యాడి గ్రామంలో మంగళవారం మొక్కలు నాటారు. కార్యక్రమంలో సర్పంచ్ పోతారెడ్డి, పంచాయతీ కార్యదర్శి అభయ్, గ్రామస్తులు పాల్గొన్నారు.
మొక్కల సంరక్షణ అందరి బాధ్యత
నార్నూర్, జూలై 20: మొక్కల పెంపకం ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని గాదిగూడ ఎంపీవో సాయిప్రసాద్ అన్నారు. గాదిగూడ మండలం లోకారి(కే) గ్రామంలో సర్పంచ్ మెస్రం దేవ్రావ్ ఆధ్వర్యంలో ప్రధాన రహదారికి ఇరువైపులా మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఎంపీటీసీ సిడాం నాగోరావ్, ఉపసర్పంచ్ సోము, పంచాయతీ కార్యదర్శి రవి, తదితరులు పాల్గొన్నారు.
హరితహారం, పరిశుభ్రతపై దృష్టి సారించాలి
నార్నూర్, జూలై 20: హరితహారం, పరిశుభ్రతపై దృష్టి సారించాలని ఎంపీడీవో రమేశ్ పంచాయతీ సిబ్బందికి సూచించారు. మంగళవారం మండలంలోని బెతల్గూడ గ్రామాన్ని సందర్శించారు. పల్లె ప్రకృతి వనం, డంప్యార్డు, సెగ్రిగేషన్ షెడ్డు, నర్సరీ నిర్వహణను పరిశీలించారు. ఇంకా చేపట్టాల్సిన అభివృద్ధి పనుల వివరాలను సర్పంచ్ జాదవ్ సుజాత పరమేశ్వర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ పల్లె ప్రగతిలో మిగిలిన పనులు పూర్తి చేయాలని, హరితహారంలో వీలైనంత మొక్కలు నాటి సంరక్షించాలని సూచించారు. ఆయన వెంట ఈజీఎస్ ఏపీవో జాదవ్ శేషారావ్, టెక్నికల్ అసిస్టెంట్ సురేశ్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ ఉన్నారు.