ఆదిలాబాద్ టౌన్, డిసెంబర్ 19 : వ్యవసాయ మార్కెట్ కమిటీ పదవులను సైతం ఆదివాసీ మహిళలకు రిజర్వ్ చేసి వారికి సముచిత స్థానం కల్పించిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ఇటీవల ఖరారైంది. ఈ నేపథ్యంలో సోమవారం కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. పట్టణంలోని మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి భారీ ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు తరలిరావడంతో కోలాహలం నెలకొంది. ఎమ్మెల్యే జోగు రామన్నతోపాటు చైర్పర్సన్ కుమ్ర విజయలక్ష్మి-రాజుకు డప్పుచప్పుళ్ల నడుమ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మార్కెటింగ్ ఏడీ శ్రీనివాస్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ బొమ్మకంటి రమేశ్ సహా 16 మంది పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు.
వారికి శుభాకాంక్షలు తెలిపారు. కమిటీ సభ్యులను ఎమ్మెల్యే రామన్న శాలువా, పుష్పగుచ్ఛాలతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఆదివాసీ మహిళలకు సముచిత స్థానం కల్పించినా అనవసర దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలు తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తమ వల్లే కమిటీల నియామకం జరిగిందని బీజేపీ నాయకురాలు ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. ఇకనైనా తీరు మార్చుకొని కేంద్రం ప్రజా సంక్షేమానికి కృషి చేయాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, నాయకులు మెట్టు ప్రహ్లాద్, జగదీశ్ యాదవ్, కుమ్ర రాజు, జంగు బాపు పాల్గొన్నారు.
చైర్పర్సన్ బాధ్యతల స్వీకరణ
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్పర్సన్గా కుమ్ర విజయలక్ష్మి ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నేతలతో కలిసి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు విజయలక్ష్మితో సంతకం చేయించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బొమ్మకంటి రమేశ్, ఎంపీపీ గండ్రత్ రమేశ్, మెట్టు ప్రహ్లాద్, బీఆర్ఎస్ నాయకులు కుమ్ర రాజు, సెవ్వ జగదీశ్ యాదవ్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లోకి 50 మంది బీజేపీ నేతలు
మండలంలోని శంషాబాద్, మోహబత్పూర్ గ్రామాలకు చెందిన బీజేపీ నాయకులు ఠాక్రే విశ్వనాథ్, అనిల్ ఖోడే, మారుతి ఖోడేతో పాటు గ్రామానికి చెందిన 50 మంది సోమవారం ఎమ్మెల్యే జోగు రామన్న సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వీరికి ఎమ్మెల్యే జోగురామన్న గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామన్న మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి నిరంతరం పనిచేస్తున్నదని చెప్పారు. బీఆర్ఎస్తోనే దేశ ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం, ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి చెందుతున్నదన్నారు.
బీజేపీ నాయకులు చిల్లర, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని, వాటిని మానుకోవాలని హితవు పలికారు. ఎనిమిదేండ్లుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు. బీజేపీ ప్రజలకు చేసిందేమిటో చెప్పాలని ప్రశ్నించారు. బీఆర్ఎస్కు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల మద్దతు లభిస్తున్నదన్నారు. ప్రధాని మోదీ హామీ ఇచ్చిన రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గ్రామంలో అర్హులైన లభ్ధిదారులకు డబు ల్ బెడ్రూం ఇండ్లతో పాటు బాజీరావు బాబా ఆలయం, హనుమాన్ ఆలయం, సీసీ రోడ్డు ని ర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ అడ్డి భోజారెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రా వుత్ మనోహర్, బీఆర్ఎస్ నాయకులు గంభీర్ ఠాక్రే, సతీశ్ పవార్, కల్యం ప్రమోద్రెడ్డి, జక్కుల మధుకర్, తన్వీర్ఖాన్, విఫిన్ ఖోడే, వట్టిపెల్లి ఇంద్రశేఖర్, మస్కే తేజ్రావ్, మంగేశ్ ఠాక్రే, గోడే మధుకర్, నాయకులు పాల్గొన్నారు.