నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 4 : జిల్లాలో అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు. నిర్మల్ కలెక్టరేట్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ముషారఫ్ అలీ ఫారూఖీతో కలిసి శుక్రవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. దళితబంధు పథకానికి లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో వంద మందిని ఎంపిక చేయాలని కోరారు. డబు ల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారులకు అందించాలన్నారు. మున్సిపాలిటీలో చేపట్టిన అభివృద్ధి పనులు మార్చిలోగా పూర్తి చేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, రాంబాబు, ఆర్డీవో రమేశ్ రాథోడ్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, అధికారులు అశోక్కుమార్, శ్రీనివాస్ పాల్గొన్నారు.
నిర్మల్లోని గాంధీచౌక్లో హనుమాన్ ఆలయ పునర్నిర్మాణానికి మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి భూమిపూజ చేశారు. అంతకుముందు ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆలయ పునర్నిర్మాణానికి రూ.30 లక్షలు మంజూరు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ లింగయ్య, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, టీఆర్ఎస్ నాయకులు కోటగిరి అశోక్, మేడారపు అపర్ణ, ప్రదీప్, మల్లికార్జున్రెడ్డి, పూదరి నరహరి, నరేందర్, భూపేశ్ పాల్గొన్నారు. ఆటోలు నడుపుతూ జీవనం సాగిస్తున్న తమకు డబుల్బెడ్రూం ఇండ్లు మంజూరు చేయాలని కోరుతూ ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షుడు గండ్రత్ రమేశ్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో నాయకులు సయ్యద్ ఇసాక్, ఎండీ ఖలీం, సుఫేన్ఖాన్, రహీం, నల్లూరు భూమయ్య, అశ్వక్ పాల్గొన్నారు.
జిల్లాను మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు సహకరించడంతో మంచి పేరు వచ్చిందని కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ అన్నారు. నిర్మల్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎస్పీ ప్రవీణ్కుమార్, కలెక్టర్ కార్యాలయంలో మంత్రి అల్లోలతో పాటు కలెక్టర్ను సన్మానించారు.
లక్ష్మణచాంద, ఫిబ్రవరి 4 : ఆలయాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషిచేస్తున్నారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. చింతల్చాందలో వినాయక ఆలయ వార్షికోత్సవానికి హాజరై పూజలు చేశారు. ఆలయం చుట్టూ ప్రహరీ, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరారు. ఎంపీపీ అడ్వాల పద్మ, జడ్పీటీసీ ఓస రాజేశ్వర్, ఎంపీటీసీ పడిగెల అనిత, నాయకులు అల్లోల సురేందర్ రెడ్డి, అడ్వాల రమేశ్, ఈటెల శ్రీనివాస్, జీ లింగారెడ్డి పాల్గొన్నారు.