చిత్రంలో కూర్చున్న వ్యక్తి.. నిర్మల్ పట్టణంలోని బుధవార్పేటకు చెందిన అబ్దుల్ సలాం.రాష్ట్ర సర్కారు 2018 సంవత్సరంలో మొదటిసారిగా కంటి వెలుగు శిబిరాలు ఏర్పాటు చేయగా పరీక్షలు చేయించుకున్నాడు. అప్పుడు కండ్లద్దాలు, మందులు ఇచ్చారు.
ఆ అద్దాలను ఇప్పటివరకు వాడుకుంటున్నాడు. సీఎం కేసీఆర్ తాజాగా మళ్లీ రెండో విడుత శిబిరాలు నిర్వహించగా.. నిర్మల్ పట్టణంలో ఏర్పాటు చేసిన క్యాంపునకు సోమవారం వచ్చాడు. అబ్దుల్ సలాం 2018లో పరీక్షలు చేసిన ప్రిస్క్రిప్షన్ రిపోర్టు, అద్దాలు తీసుకొచ్చి చూపించడంతో ఆశ్చర్యపోవడం వైద్యుల వంతు అయింది. ఈసారి వైద్యులు సలాంకు పరీక్షలు చేసి, మందులిచ్చారు. అద్దాలు పది రోజుల్లో ఇంటికొచ్చి ఇస్తామని చెప్పారు.