ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలను పొగమంచు కమ్మేసింది. బుధవారం ఉదయం 8 గంటల వరకు కూడా మంచు తెరలు వీడలేదు. ఎదురెదురుగా వాహనాలు వచ్చినా కనిపించనంతగా వ్యాపించడంతో పాదచారులు, వాహనదారులు కొంత అవస్థలు పడ్డారు.
ఆదిలాబాద్ పట్టణం, బోథ్ నియోజకవర్గం, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలాల్లో వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణం సాగించారు. మరోవైపు పొగమంచు వల్ల పత్తి పూత, పిందె రాలిపోయే ప్రమాదం ఉందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
– ఎదులాపురం/బోథ్/కెరమెరి, సెప్టెంబర్ 27