దహెగాం, మే 15 : కరోనా మొదటి వేవ్ నేర్పిన పాఠంతో ఆ గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. కట్టుదిట్టమైన నిబంధనలు పెట్టుకున్నారు. ఫలితంగా రెండో వేవ్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. అదే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండలంలోని హత్తిని గ్రామం. ఈ గ్రామంలో 494 కుటుంబాలు.. 1,244 మంది జనాభా ఉంటారు. ఆ గ్రామంలో గతేడాది ఫస్ట్ వేవ్లో 13 మందికి పాజిటివ్ వచ్చింది. గ్రామ పంచాయతీ సభ్యులు తీర్మానం చేసుకుని కట్టడి చేశారు. అందరూ మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటిస్తున్నారు. శుభకార్యాలు కూడా వాయిదా కుంటున్నారు. జనాభా గుమిగూడకుండా చర్యలు తీసుకుంటున్నారు. ప్రతి రోజూ పంచాయతీ పారిశుధ్య సిబ్బంది ్రపధాన రహదారులతోపాటు ప్రతి వీధి తిరిగి సోడియం హైపో క్లోరైడ్ ద్రావణం పిచికారీ చేస్తున్నారు. వైద్య సిబ్బంది కూడా వ్యాధులు, పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పల్లెల్లో జ్వరం, దగ్గు, జలుబు చేసిందంటే వారిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. గ్రామం దాటి బయటకు వెళ్లి వచ్చిన వారు కచ్చితంగా గోరువెచ్చని నీటితో స్నానం చేయడం, బట్టలను కూడా గోరు వెచ్చని నీటితో వేసి శుభ్రం చేస్తున్నారు. ఫలితంగా రెండో వేవ్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని గ్రామస్తులు ముక్తకంఠంతో పేర్కొంటున్నారు.
మొదటి వేవ్తో భయపడ్డాం..
కొవిడ్ మొదటి వేవ్తో మా గ్రామంలో చాలా మార్పులు వచ్చాయి. కేసులు నమోదు కావడంతో భయపడ్డా. 13 మందికి రావడంతో గ్రామ పంచాయతీ సభ్యులు తీర్మానం చేశారు. వారు చెప్పిన ప్రకారమే నడుచుకుంటున్నా. ఇప్పటివరకైతే సెకండ్ వేవ్లో ఒక్క పాజిటివ్ కూడా రాలేదు. వ్యవసాయ పనులకు వెళ్లేవారు కూడా మాస్కులు పెట్టుకునే పనులు చేసుకుంటున్నారు.
మనోజ్రావు, గ్రామస్తుడు, హత్తిని, దహెగాం మండలం.