మంచిర్యాలటౌన్, జనవరి 26: 75వ గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం మంచిర్యాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య, రాజకీయ పార్టీల నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు. గాంధీపార్క్ , మున్సిపల్ కార్యాలయం, ముఖరాం చౌరస్తాలో మున్సిపల్ కమిషనర్ అల్లె మారుతీ ప్రసాద్, గ్రంథాలయంలో అడిషనల్ కలెక్టర్ రాహుల్, ఎల్ఐసీ కాలనీలోని తన నివాసం వద్ద మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు.
ఎమ్మెల్యే ప్రేంసాగర్రావు నివాసం వద్ద డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యుత్శాఖ ఎస్ఈ శేషారావు, ్ల అటవీశాఖ సీఎఫ్ శాంతారాం, డీటీవో లెక్కల కిష్టయ్య, డీఎంహెచ్వో సుబ్బారాయుడు, ఎక్సైజ్ సీఐ నరేందర్రెడ్డి, వ్యవసాయ శాఖ ఏవో కృష్ణ, రోడ్లు భవనాల శాఖ ఏస్ఈ ఈఈ నర్సింహచారి, డీఈ బావుసింగ్, డీసీపీ రాంనాథ్ కేకన్, ఏసీపీ తిరుపతిరెడ్డి వారి కార్యాలయాల్లో జెండాలను ఎగురవేశారు.
హాజీపూర్, జనవరి 26 : గుడిపేట 13వ ప్రత్యేక తెలంగాణ పోలీస్ బెటాలియన్లో కమాండెంట్ జమీల్ బాషా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో అస్టిటెంట్ కమాండెంట్ రఘునాథ్ చౌహాన్, శరత్ కుమార్, వైద్యులు సంతోష్, శీధర్, ఆర్ఎస్ఐ, సిబ్బంది పాల్గొన్నారు. జడ్పీ కార్యాలయంలో సీఈవో నరేందర్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్పర్సన్ భాగ్యలక్ష్మి, మాజీ విప్ ఓదెలు, డిప్యూటీ సీఈవో లక్ష్మీనారాయణ, కార్యాలయ సూపరింటెండెంట్లు సత్యనారాయణ, శ్రీనివాస్, బాల కిషన్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.
మంచిర్యాల అర్బన్, జనవరి 26 : జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే నివాసం వద్ద, పార్టీ కార్యాలయాల వద్ద జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు తూముల నరేశ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తిరుపతి, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
మంచిర్యాల ఏసీసీ, జనవరి 26 : అటవీ శాఖలో ఉత్తమ ప్రతిభ చూపిన బెల్లంపల్లి ఇన్చార్జి ఎఫ్ఆర్వో ఏ సుభాష్, జన్నారం ఇన్చార్జి ఎఫ్ఆర్వో ఎండీ హఫీజొద్దీన్, మందమర్రి డిప్యూటీ ఆర్వో పీ సంతోష్, కాసిపేట ఎఫ్భీవో ఈ.రాజేశ్కు సీఎఫ్, (ఎఫ్డీపీటీ కేటీఆర్ సర్కిల్) శాంతారాం, మంచిర్యాల ఎఫ్డీవో వినయ్ కుమార్ సాహు రూ.10వేల చొప్పున రివార్డులను అందించారు.
జన్నారం, జనవరి 26 : పిల్లలు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నతమైన స్థానాలకు ఎదగాలని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జుపటేల్ పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని కలమడుగు వికానంద, పొనకల్లోని స్లేట్స్ హైస్కూల్ పాఠశాలను సందర్శించి మాట్లాడారు. పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాలల వ్యవస్థాపకుడు ఏనుగు సుభాష్రెడ్డి, ప్రిన్సిపాల్ ఏనుగు శ్రీకాంత్రెడ్డి, అమరకొండ సతీశ్, ఎం రాజశేఖర్, సయ్యద్ఇసాక్, ముజఫర్అలీఖాన్, బాల్రాజ్ తదితరులున్నారు.
సీసీసీ నస్పూర్, జనవరి 26: నస్పూర్కాలనీలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. సీసీసీ పోలీస్ స్టేషన్లో సీఐ తోట సంజీవ్, మున్సిపల్ కార్యాలయం వద్ద కమిషనర్ తన్నీరు రమేశ్, సీసీసీ కార్నర్ వద్ద డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, బీఆర్ఎస్ పట్టణ పార్టీ కార్యాలయం వద్ద అధ్యక్షుడు అక్కూరి సుబ్బయ్య మువ్వన్నెల జెం డాలను ఎగురవేశారు.
ఆదర్శ వ్యాయామశాల వద్ద ఎస్ఐ రవికుమార్, టీబీజీకేఎస్ కార్యాలయం వద్ద పెట్టం లక్ష్మణ్, గోదావరి కాలనీ షిర్కె చౌరస్తాలో సీపీఐ నాయకులు మిర్యాల రాజేశ్వర్రావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. వేర్వేరుగా జరిగిన ఈ కార్యక్రమాల్లో కౌన్సిలర్లు బేర సత్యనారాయణ, వంగ తిరుపతి, కుర్మిళ్ల అన్నపూర్ణ, పంబాల గంగా, జబిన్హైమద్, మాజీ మున్సిపల్ చైర్మన్ ఈసంపల్లి ప్రభాకర్, నాయకులు మేరుగు పవన్, గట్ట శ్రీనివాస్, గర్శె రామస్వామి, వేల్పుల రాజేశ్, గుమ్మడి శ్రీనివాస్, బాకం నగేశ్, తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లి, జనవరి 26 : బెల్లంపల్లిలో మున్సిపల్ కార్యాలయం, కాంగ్రెస్ కార్యాలయం వద్ద జెండాను ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఎగురవేశారు. జూనియర్ సివిల్ కోర్టు వద్ద జడ్జి ముఖేశ్ ఎగురవేశారు. ఆర్డీవో హరికృష్ణ, ఏసీపీ పంతాటి సదయ్య, , తహసీల్దార్ బిట్ల సుధాకర్, సీఐ రాజ్కుమార్గౌడ్, ఎస్హెచ్వో బన్సీలాల్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ టీఎస్.ప్రవీణ్కుమార్,ఐసీడీఎస్ సీడీపీవో ఉమాదేవి, ఎక్సైజ్ సీఐ దీపక్, ఫైర్ ఆఫీసర్ అనిల్, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ ఏ.అంజయ్య, ముస్లిం మైనార్టీ పాఠశాల ప్రిన్సిపాల్ షబానా వారి కార్యాలయాల వద్ద జెండాలను ఆవిష్కరించారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కొయ్యల ఏమాజీ, టీఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి టీ.మణిరామ్సింగ్ వారి కార్యాలయాల వద్ద జెండా ఆవిష్కరించారు.
జైపూర్, జనవరి 26: ప్రతి గ్రామపంచాయతీ అభివృద్ధికి రూ.5 లక్షలు నిధులు మంజూరు చేయించనున్నట్లు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. శుక్రవారం గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ముదిగుంట, మిట్టపల్లి గ్రామాల్లో శుక్రవారం పర్యటించి జాతీయ జెండాలను ఆవిషరించారు. అనంతరం మిట్టపల్లిలో ఎడ్ల పందేల పోటీలను ప్రారంభించారు. గ్రామాల్లో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. స్థానిక యువకులు ప్లే గ్రౌండ్ స్థలం కావాలని విజ్ఞప్తి చేయగా సంబంధిత అధికారులతో మాట్లాడి కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కుంటాల సౌజన్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్ల సత్యానారాయణ రెడ్డి, విశ్వంబర్ రెడ్డి , రికుల శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్ యాదవ్, వొడ్నాల రాజేశ్, రాం బాబు, యాదనవేణి మధునయ్య, మధునమ్మ, శంకర్, వెంకటేశం ,నర్సయ్య,రాజం, పోశాలు, కిష్టయ్య, అంకులు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
చెన్నూర్ టౌన్, జనవరి 26 : చెన్నూర్ పట్టణంలో గణతంత్ర దినోత్సవ వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీవో, తహసీల్దార్, పోలీస్ స్టేషన్, వ్యవసాయ, అటవీ శాఖ కార్యాలయాలు, గ్రంథాలయం, కోర్టు, పలు సంఘ భవనాల్లో సంబంధిత అధికారులు, శాఖ అధిపతులు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ గోపు గంగాధర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం చైర్ పర్సన్ అర్చనా గిల్డా, వైస్ చైర్మన్ నవాజొద్దీన్, కౌన్సిలర్లు, కో ఆప్షన్ మెంబర్లతో కలిసి ఆయన మున్సిపల్ కార్మికులకు దుస్తులు, సబ్బులు, నూనె పంపిణీ చేశారు. ఆయా కార్యాలయాల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పట్టణంలోని పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు జెండా ఎగురవేశారు. లయోల పాఠశాలలో హెచ్ఎం ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బహుమతులు ప్రదానం చేశారు.
ఆయా పాఠశాలల్లో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
లక్షెట్టిపేట, జనవరి 26: ఊత్కూర్ చౌరస్తాలో మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్రావు నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. జూనియర్ సివిల్ జడ్జి మహ్మద్ అసదుల్లా షరీఫ్, తహసీల్దార్ రాఘవేంద్రరావు, సీఐ కృష్ణ, మున్సిపల్ కమిషనర్ కల్లెడ రాజశేఖర్, ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ఆకుల శ్రీనివాస్, ఎంపీడీవో నాగేశ్వర్రెడ్డి, సబ్ జైలు వార్డెన్ స్వామి, ఎంఈవో కాసుల రవీందర్, వ్యవసాయ శాఖ ఏవో ప్రభాకర్రెడ్డి, ఐసీడీఎస్ సీడీపీవో రేష్మా, ఎఫ్ఆర్వో స్వామి వారి కార్యాలయాల వద్ద జెండాలను ఎగురవేశారు.
దండేపల్లి, జనవరి26: మండలంలో తహసీల్దార్ సంధ్యారాణి, ఎంపీపీ గడ్డం శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ కాసనగొట్టు లింగన్న, ఎస్ఐ ప్రసాద్, గూడెం ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్, వ్యవసాయ శాఖ ఏవో అంజిత్ కుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చుంచు శ్రీనివాస్, ఆయా గ్రామాల్లో సర్పంచులు జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గడ్డం నాగరాణి, ఎంపీడీవో మల్లేశ్, కస్తూర్బా విద్యాలయ ప్రత్యేకాధికారి మంజుల, తదితరులు పాల్గొన్నారు.
హాజీపూర్, జనవరి 26 : మండలంలో ఎంపీడీవో అబ్దుల్ హై, తహసీల్దార్ సతీశ్కుమార్ ఎస్ఐ నరేశ్ కుమార్, ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాలను ఎగుర వేశారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ మందపెల్లి స్వర్ణలత, వైస్ ఎంపీపీ బేతు రమాదేవి, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు నయీం పాషా, మాజీ వైస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తోట రవి, ఎంపీపీ మందపెల్లి శ్రీనివాస్, ఆయా కార్యాలయాల సిబ్బంది ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు.
టీఎన్జీవో కార్యాలయంలో.. జిల్లా కేంద్రంలోని తెలంగాణ నాన్ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు గడియారం శ్రీహరి జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భూముల రామ్మోహన్, అసోసియేట్ అధ్యక్షుడు శ్రీపతి బాపురావు, మంచిర్యాల యూనిట్ అధ్యక్షుడు నాగుల గోపాల్, తదితరులు పాల్గొన్నారు.
జన్నారం, జనవరి 26 : మండలంలో తహసీల్దార్ వేణుగోపాల్, ఎంపీడీవో ఎంపీపీ సరోజన, పీఏసీఎస్ చైర్మన్ శీలం రమేశ్, సర్పంచ్ జక్కు భూమేశ్, ఎంఈవో విజయ్కుమార్, మార్కెట్ కమిటీ నాయకురాలు సీపతి పద్మ, ఫారెస్ట్ రేంజర్ హఫీసొద్దీన్, ఐకేపీ ఏపీఎం బుచ్చన్న , ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాలను ఎగుర వేశారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీటీసీ ఎర్ర చంద్రశేఖర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రం రాజారాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి సులువ జనార్దన్, జిల్లా అధికార ప్రతినిధి సిటిమల భరత్కుమార్, కో ఆప్షన్ సభ్యుడు మున్వర్ అలీఖాన్, శీలం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
కోటపల్లి, జనవరి 26 : మండలంలో తహసీల్దార్ మహేంద్రనాథ్, ఎంపీడీవో కే భాస్కర్, ఎస్ఐ సురేశ్, వ్యవసాయ శాఖ ఏవో మహేందర్, పీఏసీఎస్ చైర్మన్ సాంబాగౌడ్, ఏఈవో రాజ్ కుమార్, పీహెచ్సీ డాక్టర్ సత్యనారాయణ, పశువైద్యాధికారి పవన్కుమార్, కస్తూర్బా గాంధీ విద్యాలయ ఎస్వో హరిత, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ లక్ష్మారెడ్డి, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం అంజన్కుమార్, సబ్స్టేషన్ ఏఈ వెంకటేశ్వర్లు, అంగన్వాడీ కేంద్రాల టీచర్లు సులోచన, రాజమణి వారి కార్యాల యాల్లో జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో సీఐ విద్యాసాగర్, ఎంపీవో అక్తర్ మొహియుద్దీన్, డీటీ సునీల్, అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
మందమర్రి, జనవరి 26: మందమర్రి మున్సిపల్ ప్రత్యేకాధికారి, జడ్పీ సీఈవో నరేందర్, సీఐ మహేందర్ రెడ్డి, విద్యుత్ శాఖ ఏఈ మల్లేశం, ఏడీఈ రాజ్కుమార్, ప్రభుత్వ దవాఖాన వైద్యుడు రమేశ్, అర్బన్ ఆరోగ్య కేంద్రం డాక్టర్ మానస, ప్రాథమిక వ్యవసాయ సహకారం సంఘం(పీఏసీఎస్) కార్యాలయం ఎదుట చైర్మన్ ఎస్ ప్రభాకర్రావు, మార్కెట్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జే.రవీందర్, టీబీజీకేఎస్ కార్యాలయం ఎదుట ఆ సంఘం ఉపాధ్యక్షుడు మేడిపల్లి సం పత్, శాంతినగర్లో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కొంగల తిరుపతి రెడ్డి, ఆయ పార్టీల కార్యాలయాల ఎదుట నాయకులు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు జెండాలను ఆవిష్కరించారు.
మందమర్రి రూరల్, జనవరి 26: మండలంలో తహసీల్దార్ చంద్రశేఖర్, ఎంపీడీవో శశికళ, వ్యవసాయ శాఖ ఏవో రాజేశం, ఎంపీడీవో శశికళ, ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ దేవానందం, ఐకేపీ ఏపీఎం లలితకుమారి, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ జయకృష్ణారెడ్డి, ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ కృష్ణయ్య, కేజీబీవీ పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్ సునీత జాతీయ పతాకాలను ఆవిష్కరించారు. అన్ని గ్రామాల్లో పంచాయతీల కార్యదర్శులు, సర్పంచ్లు జెండాలను ఆవిష్కరించారు.
భీమారం, జనవరి 26 : భీమారంలో ఎంపీడీవో శ్రీనివాస్, తహసీల్దార్ బత్తుల విశ్వంబర్, ఎస్ఐ రాజావర్ధన్, వ్యవసాయ శాఖ ఏఈవో అరుణ్ కుమార్, పశువైద్యాధికారి రాకేశ్శర్మ జడ్పీ పాఠశాల హెచ్ఎం విక్రమ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కలగూర రాజ్ కుమార్, కాంగ్రెస్ నాయకుడు గోనే మోహన్ రెడ్డి వారి కార్యా లయాల వద్ద జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్ఐ స్రవంతి, మాజీ జడ్పీటీసీ జర్పుల రాజ్ కుమార్ నాయక్, నాయకులు పోడెటి రవి, తదితరులు పాల్గొన్నారు.
తాండూర్, జనవరి 26 : మండలంలో తహసీల్దార్ రోహిత్ దేశ్పాండే, ఎంపీడీవో ప్రవీణ్కుమార్, సీఐ కే శ్రీనివాస్, ఎస్ఐ రాజశేఖర్, ఎంఈవో ప్రభాకర్, ట్రాన్స్కో ఏఈ ప్రభాకర్ , వ్యవసాయ శాఖ ఏవో కిరణ్మయి, సింగిల్ విండో చైర్మన్, పార్టీ అధ్యక్షుడు దత్తుమూర్తి, అన్ని గ్రామాల్లో జెండాలను ఎగురవేశారు. ఈ వేడుకల్లో జడ్పీటీసీ బానయ్య, ప్రజాప్రతినిధులు, తదితరులున్నారు.
నెన్నెల, జనవరి 26: మండలంలో తహసీల్దార్ ఇమ్రాన్ఖాన్, ఎంపీడీవో వరలక్ష్మి, ఎంపీపీ రమాదేవి ఎస్ఐ శ్యాంపటేల్, ఫారెస్ట్ రేంజర్ గోవింద్ సింగ్, పీఎచ్సీ డాక్టర్ లక్ష్మణ్, ఏడీఏ ఇంతియాజ్, ఏఈవో రాంచందర్, పీఏసీఎస్లో చైర్మన్ మల్లేశ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సాగర్గౌడ్, కాంగ్రెస్ నాయకుడు మల్లేశ్, బీజేపీ నాయకుడు శైలేందర్ సింగ్ జెండాలను ఎగుర వేశారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రైమరీ పాఠశాలలు, మహిళా సం ఘాలు, హమాలీ సంఘాలు, ట్రేడ్యూనియన్లు జాతీయ జెండాను ఎగుర వేశారు. ఆయా గ్రామాల్లో సర్పంచ్లు, కార్యదర్శులు జెండాలను ఎగుర వేశారు. వేడుకల్లో ఎంపీటీసీలు, సర్పంచ్ లు, పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
వేమనపల్లి, జనవరి 26 : మండలంలో ఎంపీడీవో లక్ష్మయ్య, తహసీల్దార్ సదానందం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యుడు రాజేశ్, వ్యవసాయ ఏవో వీరయ్య, పశువైద్య చందన్కుమార్, ఎస్ఐ సుబ్బారావు , ఎంఈవో తిరుపతిరెడ్డి, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ కోలి స్వర్ణలత, నీల్వాయి ఎంపీటీసీ ఆర్. సంతోష్కుమార్ , కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సాబీర్ అలీ, కో ఆప్షన్ సభ్యుడు పూర్ణచందర్, ఎంపీవో బాపురావు, వైస్ ఎంపీపీ ఆత్రం గణపతి, సర్పంచులు కుబిడె మధుకర్
గాలి మధు, ఆర్ఐ లక్ష్మణ్, ఏపీవో సత్యప్రసాద్, ప్రధానోపాధ్యాయుడు గిరిధర్రెడ్డి, జ్ఞానేశ్వర్, రెవెన్యూ, ఈజీఎస్ సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ అధికారులుగా ఎంపికైన మండల పంచాయతీ అధికారి శ్రీపతి బాపురావు, సీనియర్ అసిస్టెంట్ ఆకుల లక్ష్మీనారాయణ జిల్లా కేంద్రంలో నిర్వహించిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు అందుకున్నారు. వీరిని మండల అధికారులు, ప్రజాప్రతినిధులు అభినందించారు.
కన్నెపల్లి, జనవరి 26 : మండలంలో తహసీల్దార్ దత్తు ప్రసాద్రావు, మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో రాధాకిషన్, ఎస్ఐ నరేశ్, వ్యవసాయ శాఖ ఏవో శ్రీకాంత్, ఐకేపీ ఏపీఎం అశోక్, జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు రమేశ్, పంచాయతీ కార్యాలయాల్లో సర్పంచులు, పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయుడు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. కన్నెపల్లిలోని జిల్లా పరిషత్ పాఠశాలలో విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించగా గెలుపొందిన విద్యార్థులకు తహసీల్దార్ బహుమతులు అందించారు. పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ కార్యక్రమాల్లో జెడ్పీటీసీ కౌటారపు సత్యనారాయణ, ఎంపీటీసీ నెండుగూరి భారతి, సర్పంచులు పుల్లూరి సురేఖ, కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భీమిని మండలంలో తహసీల్దార్ బికర్ణదాస్, ఎంపీడీవో జవహర్లాల్, ఎస్ఐ ప్రశాంత్, పశువైద్యాధికారి సందీప్, ఏవో విజయ్, గ్రంథాలయం అధికారి రామారావు జాతీయ జెండాలను ఆవిష్కరించారు. పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు జెండాను ఎగురవేశారు.
చెన్నూర్ రూరల్, జనవరి 26:చెన్నూర్ మండలంలో గణతంత్ర దినోత్సవ వేడకులను ఘనంగా నిరహించారు. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలలో వేడుకలను ఘనంగా నిర్వహించారు.
పలు గ్రామాల్లో పాఠశాల విద్యార్థులు ర్యాలీ తీశారు. అంగ్రాజ్పల్లి పీహెచ్సీలో హెచ్ఈవో జగదీశ్, రైతు వేదికలలో ఏఈవోలు సాగర్, రాజశేఖర్, దివ్య, వనదేవి, గ్రామపంచాయతీల్లో సర్పంచులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. దుగ్నెపల్లి పాఠశాలలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాల్లో సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.
రామకృష్ణాపూర్, జనవరి 26: బీఆర్ఎస్ పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షుడు కంభగోని సుదర్శన్గౌడ్ ఎస్ఐ జీ రాజశేఖర్ మున్సిపాలిటీ కమిషనర్ జీ వెంకటనారాయణ ఐఎన్టీయూసీ సీనియర్ నాయకుడు తేజావత్ రాంబాబు ఎగురవేశారు. అలాగే వివిధ వార్డుల్లో వార్డు కౌన్సిలర్లు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో చైర్ పర్సన్ జంగం కళ, వైస్ చైర్మన్ ఎర్రం విద్యాసాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, డా. రాజారమేశ్ బాబు, అందుగుల శ్రీనివాస్, రామిడి కుమార్, ఆసాల రాజన్న, అలుగుల శ్రీలత సత్తయ్య,కౌన్సిలర్లు ఎల్లబెల్లి మూర్తి, గోపు రాజం, కౌన్సిలరు, కాంగ్రెస్ నాయకులు పట్టణ అధ్యక్షుడు పల్లె రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు గోపతి రాజయ్య, నాయకులు పిన్నింటి రఘునాథ్రెడ్డి, అబ్దుల్ అజీజ్, ఎండీ యాకూబ్ అలీ, తదితరులు పాల్గొన్నారు. ఆర్కేపీ ఓసీపీలో, ఆర్కేపీ సీహెచ్పీలో, సివిల్ కార్యాలయాల్లో అధికారులు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
కాసిపేట, జనవరి 26 : ఎంపీడీవో ఎంఏ అలీం, తహసీల్దార్ భోజన్న, సహకార సంఘం చైర్మన్ నీలా రాంచందర్, వ్యవసాయ ఏవో వందన, సోమగూడెం(కే)సర్పంచ్ సపాట్ శంకర్, సోమగూడెం భరత్ కాలనీసర్పంచ్ కొరికొప్పుల ప్రమీలాగౌడ్, విస్డం ఇంగ్లిష్ మీడియం స్కూల్లో కరస్పాండెంట్ లడ్డూరి రమేశ్ కుమార్, మోడల్ స్కూల్లో అందె నాగ మల్లయ్య, ప్రెస్క్లబ్ భవనం వద్ద క్లబ్ అధ్యక్షుడు ఎస్డీ నజీర్ హుస్సేన్, పాఠశాలల్లో హెచ్ఎంలు, సర్పంచులు జెండాలను ఆవిష్కరించారు.
ఆయా గ్రామాలు, పలు ప్రభుత్వ కార్యాలయాల్లో గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జైపూర్, జనవరి 26: తహసీల్దార్ రమేశ్ ఎంపీడీవో సత్యనారాయణ ఎంపీపీ గోదారి రమాదేవి జైపూర్ ఏసీపీ నరేందర్, ట్రాన్స్కో ఏఈ మనోహర్, వ్యవసాయ శాఖ ఏవో మార్క్గ్లాడ్సన్ వారి కార్యాలయాల్లో జెండాలను ఆవిష్కరించారు.