ఆదిలాబాద్ రూరల్ : ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు వ్యాయామం చేయాలని జిల్లా ఇంటర్ మీడియట్ బోర్డు అధికారి రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పండిత్ దీన్దయాళ్ ఉపాధ్యాయ జయంతి సందర్భంగా ఫిట్ ఇండియా 2కే రన్ను నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం 2కే రన్లో భాగంగా క్రీడాకారులు ,అధికారులు జాతీయ జెండా చేతబూని రన్నింగ్ చేశారు. ఈ కార్యక్రమంలో డీవైఎస్వో వెంకటేశ్వర్లు, జిల్లా ఒలింపిక్ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి, కార్యదర్శి పార్థసారథి,వ్యాయామ ఉపాధ్యాయులు రాష్ట్రపాల్, రాజేశ్, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.