మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి వినోద్ కుమార్
పలు గ్రామాల్లో అవగాహన సమావేశాలు
లక్షెట్టిపేట రూరల్, సెప్టెంబర్ 27 : వచ్చే యాసంగిలో వరికి ప్రత్యామ్నాయ పంటలు వే సుకోవాలని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని దౌడేపల్లి, జెండా వెంకటాపూర్, తిమ్మాపూర్, హన్మంతు పల్లె గ్రామాల్లో సోమవారం రైతులకు అవగాహన కల్పించారు. పప్పు దినుసులు, నూ నె గింజలు, చిరు ధాన్యాలు పండించడం ద్వారా అధిక లాభాలు పొందవచ్చన్నారు. కార్యక్రమం లో మండల వ్యవసాయాధికారి ప్రభాకర్ రెడ్డి, తిమ్మాపూర్ సర్పంచ్ చుంచు రవి, ఏఈవోలు మౌనిక, మాన్యూషా, రైతులు పాల్గొన్నారు.
పంట మార్పిడి అవలంబించాలి..
తాండూర్, సెప్టెంబర్ 27 : రైతులు పంట మార్పిడి పద్ధతిని అవలంబించాలని బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త నాగరాజు అన్నారు. రేచిని గ్రామంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారి కిరణ్మయి ఆధ్వర్యంలో రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సర్పం చ్ దుర్గుబాయి, రైతు బంధు సమితి మండల కో ఆర్డినేటర్ దత్తాత్రేయరావు, ఏఈవో శంకర్, గ్రామ కో ఆర్డినేటర్లు, రైతులు పాల్గొన్నారు.
రైతులకు అవగాహన..
చెన్నూర్ రూరల్, సెప్టెంబర్ 27 : మండలంలోని అంగ్రాజ్పల్లి, బీరెల్లి, అక్కెపల్లి, రాయ్పేట, అక్కెపల్లి గ్రామాల్లో రైతులకు వ్యవసాయ విస్తీర్ణ అధికారులు అవగాహన కల్పించారు. యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలపై దృష్టిపెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈవోలు దివ్య, వనదేవి, రమ్య, రాజశేఖర్, అంజలి, రైతులు పాల్గొన్నారు.
హాజీపూర్, సెప్టెంబర్ 27 : మండలంలోని వేంపల్లి, కొండాపూర్, టీకన్నపల్లి గ్రామాల్లోని రైతులకు బెల్లంపల్లి కేవీకే శాస్త్రవేత్త శివకృష్ణ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మార్గం రజిత, వేంపల్లి ఎంపీటీసీ డేగ బాపు, ఏఈవోలు కనుక రాజు, ఫాతిమా, ఆయా గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు.
దండేపల్లి, సెప్టెంబర్ 27 : నెల్కి వెంకటాపూర్ పంచాయతీ ఆవరణలో మండల వ్యవసాయ విస్తీర్ణాధికారి రజిత రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక రైతులు తదితరులు ఉన్నారు.