కోటపల్లి, సెప్టెంబర్ 27 : జడ్పీ, మండల పరిషత్లకు నిధులు కేటాయించి, వాటిని అభివృ ద్ధి చేసేందుకు కృషి చేయాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. సోమవారం మండలి సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రూ.500 నుంచి రూ. 600 కోట్ల నిధులు కేటాయించిందని, అయితే అవి రాకపోవడంతో ఎంపీటీసీ లు, జడ్పీటీసీలు కాస్త నిరాశతో ఉన్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. అలాగే సెస్లు రాకపోవడంతో అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందన్నారు. ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి ఇసుక ద్వారా జడ్పీ, ఎంపీ, జీపీలకు వచ్చే సెస్ను వి డుదల చేయాలన్నారు. ఈ విషయమై పంచాయతీ రాజ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావ్ సమాధానమిస్తూ సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.
మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి
మోడల్ స్కూళ్ల ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్సీ పురాణం సతీశ్ కుమార్ కోరారు. కొవిడ్ కాలంలోనూ విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా క్లాస్లు చెప్పారని, అయినప్పటికీ వారికి వేతనాలు చెల్లించడం లేదని, ఈ విద్యాసంవత్సరం వారిని రెన్యువల్ చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని సభ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయ మై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ సమస్య ప్రభుత్వం దృష్టికి వ చ్చిందని, పరిష్కారానికి కృషి చేస్తామని హామీనిచ్చారు.
హెచ్బీటీల హర్షం
మండలి సమావేశాల్లో తమ సమస్యలను ఎ మ్మెల్సీ ప్రస్తావించినందుకు హెచ్బీటీల సం ఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెంకట ర మణ, హెచ్బీటీలు వారణాసి సురేందర్, వీరస్వామి, శంకర్, కృష్ణ, ప్రేంసాగర్, అనూష, హేమలత, శైలజ కృతజ్ఞతలు తెలిపారు.
కలెక్టర్ భవనం పూర్తి చేయాలి
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, సెప్టెంబర్ 27 : పరిపాలన సౌలభ్యం కోసం అన్ని సేవలను ఒకేచోట లభ్యమయ్యేలా అధునాతనంగా జి ల్లా కేంద్రంలో నిర్మిస్తున్న కలెక్టరేట్ను త్వరగా పూర్తి చేయాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు కోరారు. సోమవారం అసెంబ్లీ సమావేశంలో మాట్లాడారు . 2017లో పనులు ప్రా రంభమైనప్పటికీ ఇప్పటివరకు పూర్తి కాలేదని అన్నారు. అదేవిధంగా జిల్లాగుండా వెళ్తున్న నేషనల్ హైవే నలుగు వరుసల రహదారి 363 వలన వాంకిడి మండలంలో చాలా మందికి నష్ట పరిహారంలో కొంత వ్యత్యాసం ఉందని, దాన్ని పూడ్చాలని , రెబ్బెన మండల కేంద్రం లో నిర్మిస్తున్న అండర్ పాస్ బ్రిడ్జి వలన చిరు వ్యాపారులు నష్టపోతున్నారని, ఓపెన్ పిల్లర్ బ్రిడ్జి నిర్మించాలని విన్నవించారు.