ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న
ఆదిలాబాద్ రూరల్, జూలై 25: తెలంగాణ సంస్కృతి లో బోనాలకు ప్రాధాన్యముందని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. పట్టణంలోని తాటిగూడ, ఆదర్శ్న గర్లో ఆదివారం నిర్వహించిన శోభాయాత్రలో బోనమెత్తి ముందు నడిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా ఉండాలని, పాడి పంటలు సుభిక్షంగా పండాలని ఆషాఢ మాసంలో ప్రజలు గ్రామదేవతలకు బోనాలు సమర్పిస్తారన్నారు. పోచమ్మ , మైసమ్మ, మహంకాళి.. తదితర రూపాల్లో అమ్మవార్లను కొలుస్తారని పేర్కొన్నారు. కరోనా వైరస్ పూర్తిగా అంతమ వ్వాలని పోచవ్వ తల్లిని వేడుకున్నట్లు చెప్పారు. కౌన్సిలర్ పందిరి భూమన్న, కో ఆప్షన్ సభ్యురాలు మమత, మార్కె ట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, నాయకులు సంజయ్, క స్తాల ప్రేమల, స్వరూప, పాల్గొన్నారు.
వ్యాయామం తప్పనిసరి
సమాజంలో ప్రతి ఒక్కరూ రోజుకు కనీసం గంట పాటై న వ్యాయామం తప్పనిస రిగా చేయాలని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. న్యూహౌసింగ్ బోర్డులోని అగ్రజా టౌన్ప్లో కొత్త జి మ్ను ఆయన ప్రారంభిం చారు. వ్యాయామం, యో గా ద్వారా ఆరోగ్యాన్ని కా పాడుకునే వీలుంటుంద న్నారు. కౌన్సిలర్ జాదవ్ పవన్ నాయక్, రైతబంధు సమితి జిల్లా అధ్యక్షుడు అ డ్డి భోజారెడ్డి, మార్కెట్ క మిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లా ద్, నాయకులు తిరుమలేశ్, శరత్రెడ్డి, విలాస్, జిమ్ నిర్వా హకుడు విజయ్ తదితరులు పాల్గొన్నారు.