కౌటాల, అక్టోబర్ 23 : సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలని ఎంపీపీ బసార్కర్ విశ్వనాథ్ అన్నారు. మండలకేంద్రంలోని ఎమ్మెల్యే కోనప్ప నివాసంలో మండల కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా లబ్ధిదారులకు అందించాలన్నారు. నవంబర్ 15న వరంగల్లో నిర్వహించనున్న విజయగర్జనకు కార్యకర్తలను సమాయత్తం చేయాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్ చైర్మన్ మాం తయ్య, రైతుబంధు సమితి మండల కన్వీనర్ బ్రహ్మయ్య, పార్టీ మండలాధ్యక్షుడు వసంత్రావు, యువజన సంఘం మండలాధ్యక్షుడు రవీందర్ గౌడ్, మైనార్టీ సెల్ మండలాధ్యక్షుడు నహీం అహ్మద్, ఎస్టీ సెల్ మండలాధ్యక్షుడు బాపు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ సదాశివ్, ఎంపీటీసీ మనీశ్, పార్టీ ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు, పవన్, సర్పంచ్లు, కార్యకర్తలు ఉన్నారు.
విజయగర్జనను జయప్రదం చేయాలి..
దహెగాం, అక్టోబర్ 23 : వరంగల్లో నవంబర్ 15న నిర్వహించనున్న టీఆర్ఎస్ విజయగర్జన సభను జయప్రదం చేయాలని పార్టీ మండలాధ్యక్షుడు ప్రసాద్రాజు అన్నారు. మండలకేంద్రంలో నాయకలు, కార్యకర్తలతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 20 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి పంచాయతీ నుంచి 50 మందికి పైగా తరలిరావాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని సూచించారు. రైతుబంధు సమితి మండల కన్వీనర్ కం భగౌని సంతోష్గౌడ్, వైస్ ఎంపీపీ చౌదరి సురేశ్, సర్పంచ్ బం డ కృష్ణ, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
ఎంపీపీ కార్యాలయంలో..
చింతలమానేపల్లి , అక్టోబర్ 23 : మండలకేంద్రంలోని ఎంపీపీ కార్యాలయంలో టీఆర్ఎస్ మండల కార్యకర్తల సమావేశాన్ని శనివారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండలాధ్యక్షుడు డుబ్బుల వెంకయ్య మాట్లాడుతూ విజయగర్జనకు సంబంధించి కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. ఎంపీపీ డుబ్బుల నానయ్య, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు భీంకరి నారాయణ, యూత్ అధ్యక్షుడు ఉమ్మరి హరీశ్, కోఆప్షన్ సభ్యుడు నాజీం హుస్సేన్, నీలాగౌడ్, ఎంపీటీసీలు, సర్పంచ్లు , కార్యకర్తలు పాల్గొన్నారు.