మంచిర్యాల, నవంబర్ 14(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అతివల సంక్షేమానికి అత్యద్భుత పథకాలను ప్రవేశపెట్టింది. ఆకాశంలో సగం, అవనిలో సగం అంటున్న మహిళలకు అన్నీతానై నిలిచింది. కేసీఆర్ కిట్టు, కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, ఆసరా పింఛన్, రుణాలు, ఆరోగ్య లక్ష్మి, ఆరోగ్య మహిళ వంటి స్కీములు ప్రవేశపెట్టి మహిళల ఆదరణ పొందింది. స్వయం సహాయక సంఘాల ద్వారా రుణాలు అందిస్తూ ఆర్థికంగా ఎదగడానికి తోడ్పాటును అందించింది. రాజకీయంగా రాణించడానికి స్థానిక సంస్థల ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రకటించిన మ్యానిఫెస్టోలో కూడా ప్రతి పేద మహిళకు ప్రతినెలా రూ.2,500 ఇవ్వాలని నిర్ణయించారు. సోమవారం ఎన్నికల సంఘం విడుదల చేసిన ఓటర్ల జాబితాలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళా ఓటర్లే అధికంగా ఉండగా.. వీరే గెలుపోటముల్లో కీలకంగా మారనున్నారు. కాగా.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నారీమణులు జై కొడుతుండడం కొసమెరుపు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళ సంక్షేమానికి పెద్దపీట వేసింది. గడిచిన తొమ్మిదిన్నరేండ్ల పాలనలో మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. ఆడపిల్ల పుడితే కేసీఆర్ కిట్టు, ఆడబిడ్డ పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి/షాదీ ముబారక్, విధి వంచిత ఒంటరి మహిళలకు పింఛన్, స్వయం సహాయక బృందాల ద్వారా మహిళలకు రుణాలు, మహిళలకు పోషకాహారం అందించే ఆరోగ్యలక్ష్మి, ప్రభుత్వ దవాఖానల్లో స్త్రీ ఆరోగ్య సమస్యల చూసేందుకు ప్రతి మంగళవారం ఆరోగ్య మహిళ, బీడీ కార్మిక మహిళలకు, వృ ద్ధులకు ఆసరా పింఛన్లు.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమ పథకాలు కేవలం తెలంగాణ ఆడబిడ్డల కోసం అమలు చేస్తున్నది. అ న్నింటి కన్నా ముఖ్యంగా ఆడవాళ్లు ఎందులోనూ మగవారికి తక్కువ కాదనే ఉద్దేశంతో స్థానిక సంస్థల్లో 50 శాతం రిజర్వేషన్లు అమ లు చేస్తున్నది.
ఈ తరహా నిర్ణయం తీసుకున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ యావత్ దేశానికే ఆ దర్శంగా నిలుస్తున్నది. ఆడవాళ్లంటే కేవలం వంటింటికే పరిమితం కాదు.. అన్ని రంగాల్లో నూ వారు సత్తా చాటగలరని నిరూపిస్తున్నది. కాగా మహిళల కోసం మరో అద్భుతమైన పథకాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోలో చేర్చారు. పేద మహిళలకు ప్రతి నెల రూ. 2500 ఇవ్వాలని నిర్ణయించారు. ఈ నేపథ్యం లో మహిళల సంక్షేమం, రాజకీయ, ఆర్థిక రం గాల్లో వారి పురోగతికి కృషి చేస్తున్న బీఆర్ఎస్ పార్టీపై మహిళలకు మక్కువ పెరుగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మహిళలు కీలకంగా మారనున్నారు. వారు ఎవరికి సపోర్ట్ చే స్తే ఆ పార్టీ ఎన్నికల్లో గెలవడం ఖాయంగా కనిపిస్తున్నది. జిల్లాలో పది నియోజకవర్గాలు ఉం టే అందులో 9 నియోజకవర్గాల్లో పురుషుల కంటే మహిళ ఓటర్లు అధికంగా ఉన్నారు. తెలంగాణ స్వరాష్ట్రంలో మూడోసారి జరుగుతున్న ఎన్నికల్లో బీఆర్ఎస్కు, ముఖ్యమంత్రి కేసీఆర్కు నారీమణులు జై కొడుతున్నారు. ఈ సందర్భంగా గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో తెలంగాణ సర్కారు ద్వారా లబ్ధిపొందిన నారీమణులను ‘నమస్తే తెలంగాణ’ పలకరించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
మా కుటుంబానికి పెద్ద దిక్కు..
నిర్మల్ టౌన్, నవంబర్ 14 : మాది నిర్మల్ పట్టణంలోని బోయవాడ. మా ఆయన నర్సయ్య చేపలు పడితేనే కుటుంబం గడిచేది. ఎక్కడెక్కడికో వెళ్లి చెరువులో చేపలను పడితే అమ్ముకోగా వచ్చిన పైసలతోటే పొట్ట పోసుకునేవాళ్లం. ఒక్క సీజన్లోనే చేపలు ఉంటుండే. మిగతా కాలంలో వేరే పనులు చేసుకునేవాళ్లం. ఇదంతా తెలంగాణ రాకముందు. తెలంగాణ వచ్చినంక మా బతుకులు మారినయ్. చెరువులు, ప్రాజెక్టుల్లో నీళ్లు ఉండడంతో ఏడాదంతా చేపలతోనే జీవనోపాధి పొందుతున్నం. 2020లోనే తెలంగాణ ప్రభుత్వం వంద శాతం సబ్సిడీతో మా ఆయనకు బండి అందించింది. మాకు ముగ్గురు ఆడబిడ్డలే. పెద్దబిడ్డ పెళ్లి చేసినప్పుడు కల్యాణలక్ష్మి లేకుండే. రెండో బిడ్డ అభిసారికకు 2020లో పెండ్లి చేసినం. కల్యాణలక్ష్మి కింద రూ. 1,01,116 అందింది. మళ్లీ మా ఆయన మత్స్యశాఖ ఆధ్వర్యంలో పెద్ద వాహనానికి దరఖాస్తు చేసుకుంటే రూ.10 లక్షలతో ట్రాన్స్పోర్ట్ వాహనం మంజూరైంది. పట్టిన చేపలను అందులోనే మార్కెట్కు తీసుకపోయి అమ్ముతున్నడు. నేను బీడీలు చుడుతా. నాకూ తెలంగాణ సర్కారు రూ.2,016 పింఛన్ ఇస్తున్నది. అన్ని పథకాలు మాకు వర్తించినందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకే ఈ సారి మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తాం.
– తోకల నర్సమ్మ, బోయవాడ
కేసీఆర్ సార్ మంచిగుండాలె..
తాంసి, నవంబర్ 14 : మా సొంటి ఒంటరిగా ఉండే ఆడోళ్ల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గీ పథకం తీసుకొచ్చుడు షానా బాగుంది. నెలకోసారి సారు పేరు జెప్పుకొని 2016 రూపాలు తీసుకుంటున్నాం. ఏదో రకంగా మా కడుపు నింపుకోవడానికి ఉపయోగపడుతున్నయ్. ఎన్నో పెబుత్వాలొచ్చినా. మమ్ముల్ని పట్టించుకున్నోడే లేడు. మాలాగే ఎంతో మందిని ఆదుకుంటున్న కేసీఆర్ సారు మంచిగుండాలె. ఆయనిచ్చే నెల పింఛన్తోనే ఇంత కలో గంజో తాగుతున్న. సీఎం కేసీఆర్కు మేం ఎప్పుడూ రుణపడి ఉంటాం.
– మగ్గిడి అంజలి, హస్నాపూర్
ఆరోగ్య మహిళతో భరోసా..
నిర్మల్ చైన్గేట్, నవంబర్ 14 : నేను గైనిక్ సమస్యతో బాధపడుతున్నా. ప్రైవేటు దవాఖానకు పోతే ఆర్థిక భారం పడుతున్నది. పట్టణంలోని బంగల్పేట ఆసుపత్రిలో ప్రతీ మంగళవారం మహిళల కోసం ప్రత్యేకంగా ఆరోగ్య మహిళ క్లినిక్ ఏర్పాటు చేశారు. మాకు అందుబాటులో ఉండడంతో ఇక్కడికి వచ్చా. ఇక్కడ ప్రత్యేకంగా గైనకాలజీ వైద్య నిపుణులు ఉన్నారు. ఆసుపత్రిలో రక్త పరీక్షలతో బీపీ, ఇతర పరీక్షలు చేశారు. ఉచితంగా మందులు పంపిణీ చేస్తున్నారు. మహిళల సమస్యలు మహిళలకే చెప్పడం బాగుంది. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళా శిశు ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నది. తెలంగాణ సర్కారు ఎక్కడా లేని విధంగా ఆరోగ్య మహిళా క్లినిక్లు ఏర్పాటు చేయడం సంతోషకరం. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్య భరోసా కల్పిస్తుంది.
– కల్పన, గాంధీచౌక్, నిర్మల్
ఆరోగ్య లక్ష్మి.. నిరుపేదలకు వరం..
నిర్మల్ చైన్గేట్, నవంబర్ 14 : గర్భిణుల్లో రక్తహీనతను నివారించేందుకు, పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం పోషకాహారం అందించాలనే ఉద్దేశంతో ప్రవేశపెట్టిన ఆరోగ్య లక్ష్మి పథకం చాలా బాగుంది. అంగన్వాడీ కేంద్రంలో నిత్యం ఆకు కూరలు, కాయగూరలు, పప్పు, గుడ్లతో కూడిన ఆహారం అందిస్తున్నారు. రుచికరమైన భోజనం పెడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ మాతా శిశు ఆరోగ్యానికి అనేక పథకాలు తీసుకువచ్చారు. నిత్యం నేను అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పోషకాహారం తీసుకుంటున్నా. ఇక్కడ రుచికరమైన భోజనంతో పాటు పాలు, గుడ్లు అందిస్తున్నారు. చిన్నారులకు బాలామృతం ఇస్తున్నారు. నిరు పేదలకు ఈ పథకం వరం.
– కే శ్రీలత, ఖానాపూర్