మేడ్చల్ జోన్ బృందం : ఉపాధ్యాయులు, ఉద్యోగులకు 30 శాతం ఫిట్మెంట్తో పాటు పీఆర్సీ ఇవ్వడంతో సీఎం కేసీఆర్ చిత్రపటాలకు నియోజకవర్గంలోని పలు మండలాల్లో క్షీరాభిషేకం చేశారు. కరోనా సంక్షోభ సమయంలో కూడా తమ సంక్షేమాన్ని కాంక్షించారని కొనియాడారు. ప్రభుత్వం అందిస్తున్న సంపూర్ణ సహకారంతో విధులను మరింత అంకిత భావంతో నిర్వహించి, ప్రజలకు సేవ చేస్తామని పేర్కొన్నారు. మేడ్చల్ ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నేత మర్రి రాజశేఖర్రెడ్డి పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ పద్మాజగన్రెడ్డి, టీఆర్ఎస్కేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్, కౌన్సిలర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. మేడ్చల్ మండలం పూడూరు గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో క్షీరాభిషేకం చేశారు. సర్పంచ్ బాబు యాదవ్, టీఆర్ఎస్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి లహరిరెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
జవహర్నగర్లో…
కార్పొరేషన్లోని అంగన్వాడీ టీచర్లు ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ముఖ్యమంత్రి అంగన్వాడీ టీచర్లపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని, జీవితాంతం తమ గుండెల్లో పెట్టుకుంటామని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అంగన్వాడీ టీచర్లు వనజాక్షి, బాలమణి, కుమారి, సరస్వతి, అనిత, అనురాధ, జయమ్మ, కల్యాణి, సుజాత, నిర్మల పాల్గొన్నారు.
శామీర్పేటలో..
సీఎం కేసీఆర్ ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ 30శాతం ప్రకటించడంపై పీఆర్టీయూటీఎస్ మండల శాఖ అధ్యక్షుడు జాకబ్, ప్రధాన కార్యదర్శి రామిడి వెంకట్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
కొర్రెములలో..
మండల పరిధి కొర్రెముల జడ్పీ పాఠశాలలో కృతజ్ఞతలు తెలుపుతూ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఎనుగు సుదర్శన్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచిన ఘనత కేసీఆర్దేనని చెప్పారు. ఎంపీటీసీ వినోద , మండల టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి బి.నాగరాజు, ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షుడు సుదర్శన్, యువజన విభాగం అధ్యక్షుడు బాలు యాదవ్, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
అవుషాపూర్ ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ ఏనుగు కావేరి మశ్చేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సంబురాలు చేశారు. ఎంపీపీ సుదర్శన్ రెడ్డి, కార్యదర్శి ఉమాదేవి, ఉప సర్పంచ్ అయిలయ్య యాదవ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.