ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 1 : రాష్ట్ర సర్కారు అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రతి ఇంటికీ చేర్చడమే లక్ష్యమని ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖానాయక్ అన్నారు. ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ సర్పంచ్ గోడం నాగోరావ్తో పాటు, గ్రామస్తులు, మండలంలోని అంజీ గ్రామస్తులు మొత్తం 200 మంది ఎమ్మెల్యే సమక్షంలో బుధవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కాగా, వారికి గులాబీ కండువాలు కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు. వడగాం పంచాయతీ పరిధి సకారాంతండాలో రూ.3 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు.., అంజీ పంచాయతీ పరిధిలోని మామిడిగూడలో రూ.5 లక్షలతో మంజూరైన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వడగాం, అంజీ పంచాయతీలకు రూ.10 లక్ష చొప్పున నిధులతో సీసీ రోడ్లు, ‘మన ఊరు-మన బడి’ కింద పాఠశాల నిర్మాణానికి రూ.6.80 లక్షలు, ఈజీఎస్ ద్వారా రూ.11.50 లక్షలు మంజూరు చేయడంతో భవనంతోపాటు, మరుగుదొడ్లు, మూత్రశాలలు, ప్రహరీ నిర్మిస్తున్నట్లు చెప్పారు.
మామిడిగూడ(జీ)కు వాగుపై వంతెన నిర్మించాలని పీఆర్ డీఈ రమేశ్కు సూచించారు. హీరాపూర్కు రూ.15 లక్షలతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పోటే శోభాబాయి, పీఏసీఎస్ చైర్మన్ మారుతిపటేల్డోంగ్రే, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జద్, బీఆర్ఎస్ పార్టీ మండల కోఆర్డినేటర్ షేక్ సుఫియాన్, ఏఎంసీ మాజీ చైర్మన్ రాథోడ్ వసంత్రావ్, ఎంపీటీసీ కోవ రాజేశ్వర్, గిత్తే ఆశాబాయి, సర్పంచులు జాదవ్ లఖన్సింగ్, కుడే కైలాస్, గారుళే కుసుమబాయి, ఆత్రం రత్తుబాయి, గోడం నాగోరావ్, రైతు బంధు సమితి మండల కన్వీనర్ తొడసం హరిదాస్, నాయకులు దశరథ్పటేల్, ఆరెల్లి రాందాస్, బాబుముండే, శివాజీ, రోహిదాస్, ఆత్రం ధర్ము, కేంద్రెశ్యామ్, తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి ఇన్సూరెన్స్ చెక్కు అందజేత..
కడెం మండలం ఉడుంపూర్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త గైక్వాడ్ శశిపాల్ ప్రమాదవశాత్తు మృతిచెందాడు. కాగా, పార్టీ తరఫున మంజూరైన రూ.2లక్షల ఇన్సూరెన్స్ చెక్కును బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రేఖానాయక్ అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. పార్టీని నమ్ముకొని పనిచేసే ప్రతి కార్యకర్తకూ సీఎం కేసీఆర్ అండగా ఉంటారని భరోసా నిచ్చారు. అలాగే అల్లంపల్లి గ్రామానికి చెందిన పార్టీ కార్యకర్త సింగిరెడ్డి నర్సింహారెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా, బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి ఇద్దరు పిల్లల చదువు కోసం తనవంతుగా రూ.50 వేలు ఫిక్స్ డిపాజిట్ చేసి, సంబంధిత పత్రాలను వారికి అందజేశారు. అనంతరం ఉడుంపూర్లో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు జొన్నల చంద్రశేఖర్, వైస్ ఎంపీపీ కట్టా శ్యాంసుందర్, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు రఫీక్హైమద్, నాయకులు బొర్లకుంట రాజేశ్, హాసీబ్, సోలోమన్ నాయక్, రవీందర్, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.