గ్రామాల్లో ప్రత్యేక డ్రైవ్
హాజరైన ప్రజాప్రతినిధులు, అధాకారులు
బేల, సెప్టెంబర్ 17: వ్యాక్సినేషన్పై అపోహలు వీడి ప్రతి ఒక్కరూ వేసుకోవాలని ఎంపీపీ వనిత ఠాక్రే కోరారు. మండలంలోని దహెగాం గ్రామంలో శుక్రవారం మండల అధికారులతో కలిసి ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీవో భగత్ రవీందర్, ఎంపీవో సమీర్ హైమద్, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షుడు గంభీర్ ఠాక్రే, సర్పంచ్ అంబుతాయి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.
బోథ్, సెప్టెంబర్ 17: 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేసుకోవాలని సొనాల పీహెచ్సీ డాక్టర్ నవీన్రెడ్డి కోరారు. పొచ్చెర, కుచులాపూర్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన టీకా కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే బోథ్లోని న్యూకాలనీలో వ్యాక్సినేషన్ ప్రక్రియను సర్పంచ్ సురేందర్యాదవ్, ఎంపీటీసీ షేక్ రజియాబేగం పరిశీలించారు. కౌఠ(బీ)లో సర్పంచ్ రాధిక, ఎంపీటీసీ శిరీషారెడ్డి కేంద్రాలకు వెళ్లి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జడ్పీ కోఆప్షన్ సభ్యుడు తాహెర్ బిన్ సలాం, సత్యనారాయణ, రాజు, ప్రశాంత్, శ్రీనివాస్, రమేశ్ పాల్గొన్నారు.
గుడిహత్నూర్, సెప్టెంబర్ 17: మండలంలోని మాన్కపూర్, రాంజీగూడ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొవిడ్ టీకా కేంద్రాన్ని మండల వైద్యాధికారి శ్రీనివాస్ పరిశీలించారు. టీకా తీసుకోవడానికి కొంతమంది ముందుకు రావడం లేదని వైద్య బృందం డాక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించారు. ఆయన వెంట హెల్త్ సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.
నేరడిగొండ, సెప్టెంబర్ 17 : మండలంలోని వాంకిడి, రాజులతండా గ్రామాల్లో పీహెచ్సీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డాక్టర్ ఆనంద్కుమార్, సర్పంచ్ రాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
జైనథ్, సెప్టెంబర్ 17: గిమ్మ, జైనథ్ పీహెచ్సీ పరిధిలోని పిప్పర్వాడ, గిమ్మ, కూర, కరంజి గ్రామాల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్లను సర్పంచ్లు పరిశీలించారు. గ్రామాల్లో 100 శాతం పూర్తయ్యేందుకు వైద్య సిబ్బంది తేదీలను ఖరారు చేశారు.
తాంసి, సెప్టెంబర్ 17: అర్హులైన ప్రతి ఒక్కరూ కొవిడ్ టీకా వేయించుకోవాలని జడ్పీటీసీ రాజు కోరారు. మండలంలోని కప్పర్ల గ్రామంలో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ సెంటర్ను పరిశీలించారు. ఆయన వెంట సర్పంచ్ సదానందం, టీఆర్ఎస్ మండల కన్వీనర్ పులి నారాయణ, వైద్య సిబ్బంది, అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు ఉన్నారు.
నార్నూర్, సెప్టెంబర్ 17: గాదిగూడ పీహెచ్సీ పరిధిలో ఉమ్రి, ఖడ్కి, బొప్పాపూర్, దాబా, పావునూర్ గ్రామాల్లో కొవిడ్ టీకా శిబిరం నిర్వహించారు. టీకా వేసే తీరును డీఆర్డీవో రాథోడ్ రవీందర్ పరిశీలించారు. 265 మందికి టీకా వేసినట్లు డాక్టర్ పవన్ కుమార్ తెలిపారు. డీఆర్డీవో వెంట హెచ్ఈ సంజయ్, హెచ్ఎస్ రత్న, ఎంపీవో సాయిప్రసాద్, వైద్య సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు ఉన్నారు.