ఘనంగా దుర్గామాతల శోభాయాత్ర, నిమజ్జనం
పూజలు చేసిన ప్రజాప్రతినిధులు, నాయకులు
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
ఇంద్రవెల్లి, అక్టోబర్16: మండలకేంద్రంలో నిర్వహించిన దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు శనివారం ముగిశాయి. మండలకేంద్రంలోని రాధాకృష్ణ మందిరం ఆవరణలో ఏర్పాటు చేసిన దుర్గాదేవి మండపం వద్ద జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్, ఎమ్మెల్యే రేఖానాయక్, బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జడ్పీ చైర్మన్ను శాలువాతో సన్మానించారు. మండలకేంద్రానికి చెందిన ప్రముఖ వ్యాపారి చింతావార్ సంతోష్ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదానం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ మారుతి పటేల్ డోంగ్రే, ఏఎంసీ చైర్మన్ రాథోడ్ మోహన్ నాయక్, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు మహ్మద్ అబ్దుల్ అమ్జాద్, ఇంద్రవెల్లి ఉప సర్పంచ్ తైహిరే గణేశ్, మాజీ ఎంపీపీ కనక తుకారాం, టీఆర్ఎస్ నాయకులు దేవ్పూజె మారుతి, హనుమంత్రావ్, శ్రీనివాస్, శ్రీరాం నాయక్, షేక్ సుఫియాన్, కోరెంగ సుంకెట్రావ్, ఉపాధ్యాయుడు అనిల్ రాథోడ్, ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ఘనంగా దుర్గాదేవి నిమజ్జనం
నార్నూర్,అక్టోబర్16: ఉమ్మడి మండలంలోని పలు గ్రామాల్లో దుర్గాదేవి నిమజ్జన కార్యక్రమాన్ని కమిటీ సభ్యులు ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే మహిళలు దుర్గాదేవికి ప్రత్యేక పూజలు చేశారు. మండపాల వద్ద మహిళలు, యువతులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఆయా మండపాల వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బానోత్ గజానంద్ నాయక్, నార్నూర్ సహకార సంఘం ఇన్చార్జి చైర్మన్ ఆడే సురేశ్, ఉప సర్పంచ్ చౌహాన్ మహేందర్, గ్రామపెద్దలు, మండప నిర్వాహకులు ఉన్నారు.
భీంపూర్లో..
భీంపూర్, అక్టోబర్16: మండలంలోని పిప్పల్కోటి, గుబ్డీ, అంతర్గాం, కరంజి(టీ) తదితర గ్రామాల్లో దుర్గాదేవి విగ్రహాల నిమజ్జనం కనుల పండవగా నిర్వహించారు. సమీప వాగులు, పెన్గంగలో గంగపుత్రుల సాయంతో నిమజ్జనాలు చేశారు. శారదాదేవి మండపాల వద్ద విశేష పూజలు కొనసాగుతున్నాయి.