ఆదిలాబాద్ రూరల్, జూన్ 11: రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పేర్కొన్నారు. మండలంలోని మామిడిగూడలో శుక్రవారం రైతులకు ఉచితంగా కంది విత్తనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడంతో పాటు పప్పు దినుసులను పండించేల రైతులను చైతన్యవంతులను చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కంది విత్తనాలు పంపిణీ చేస్తుందని తెలిపారు. రైతులు పండించిన పంటలను ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో వైస్ఎంపీపీ రమేశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ మెట్టు ప్రహ్లాద్, మండల వ్యవసాయాధికారి ఆశ్రఫ్, నాయకులు సెవ్వ జగదీశ్, ఇటిక్యాల భూమన్న, ఆరె నరేశ్కుమార్, ఎంపీటీసీలు, సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.