రామకృష్ణాపూర్, మార్చి 10 : రామకృష్ణాపూర్లోని జడ్పీ బాలుర పాఠశాలలో 1992-1993 పదో తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం అపూర్వ సమ్మేళనం నిర్వహించారు. 150 మంది ఒకేచోట చేరి జ్ఞాపకాలను నెమరేసుకున్నారు. పాఠశాల అభివృద్ధికి ఆర్థిక సాయమందిస్తామని తెలిపారు.
గురువులు నారాయణరావు, వామనమూర్తి, రాజేశ్వర్రావు, చంద్రమౌళి, వీర శంకర్, జగన్, చంద్రసుశీల, రోజ్మేరీ, మధురాబాయి, ప్రస్తుత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్లను ఘనంగా సన్మానించి మెమొంటోలు అందజేశారు.